ఆర్.కె న్యూస్, నస్పూర్: విజ్ఞానం కోసం విద్యార్థులు సైన్స్ పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా స్థాయి జిజ్ఞాస సంచార ప్రయోగశాల నిర్వహకులు సాయి కుమార్, సంపత్ లు తెలిపారు. శుక్రవారం నస్పూర్ మండలంలోని సింగపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జిల్లా సైన్స్ ఆఫీసర్ మధుబాబు పర్యవేక్షణలో విద్యార్థులకు సైన్స్ పై అవగాహన కల్పించారు. మానవ శరీరం, అంతర్గత అవయవాల పనితీరు, ప్రయోగ పరికరాల పని విధానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మహేశ్వర్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
– రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, శాసనమండలి సభ్యులు దండే విఠల్, సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కోనేరు కోనప్పతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం రాధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలోని అచ్చెల్లి – చింతకుంట వంతెన, శివపూర్ – హీరపూర్ వంతెన ప్రారంభించడం జరిగిందని, శివపూర్ – హీరాపూర్ రోడ్డుకు భూమి పూజ, పాతట్లగూడ వంతెన ప్రారంభించడం జరిగిందని, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మన్నేవార్ సంఘం భవనానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. కౌటాల మండలంలో మొఘడ్ దగడ్ – వైగాం రోడ్డుకు భూమి పూజ, వార్థా నదిపై 75 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గుండాయిపేట్ – నందివర్థా (మహారాష్ట్ర) మధ్య హైలెవల్ అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి భూమి పూజ, చింతల మానేపల్లి మండల కేంద్రంలో 133 కె . వి. సబ్ స్టేషన్ కు భూమి పూజ, చింతల్ పాటి – గురుడుపేట్ రోడ్డుకు, చింతలమానేపల్లి – గంగపూర్ రోడ్డుకు, కర్జెళ్లి – బారేగూడ రోడ్డుకు భూమి పూజ, దిందాలో లో-లెవల్ వంతెన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం పై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నెల 4 వేల 16 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుందని, మహిళా సంక్షేమం కోసం ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు గర్భిణులకు సకాలంలో సరైన పోషకాహారం అందించేందుకు న్యూట్రిషన్ కిట్, ప్రసవం తర్వాత బాలింతలకు కె సి ఆర్ హిట్ అందించడం జరుగుతుందని తెలిపారు. వెనుకబడిన తరగతులు, మైనారిటీల కొరకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకాన్ని అందించడం జరుగుతుందని, గృహలక్ష్మి పథకం ద్వారా సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేని వారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇలా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరం భారతదేశంలోనే విభిన్న సంస్కృతులకు నిలయంగా సుందర నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరం క్రీస్తుశకం 1591లో కుతుబ్ షాహీ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా చేత చార్మినార్ కేంద్రంగా, మూసి నది ఒడ్డున నిర్మించబడింది.హైదరాబాద్ నగరం నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనలో రాజధానిగా పేరు గాంచింది. హైదరాబాద్ లో తరచుగా వరదలు వచ్చేవి. 1908 సెప్టెంబర్ 27 తెల్లవారుజామున 2 గంటలకు “క్లౌడ్ బరస్ట్” వలన విపరీతంగా వర్షం కురిసింది.1908 సెప్టెంబర్ 28న వరద ఉధృతంగా ప్రవహించి మూసి నది 60 అడుగులకు చేరింది. ఈ వరదల వలన అఫ్జల్ గంజ్ లోని కోల్ సవాడి, ఘన్సీ బజార్ లో అత్యధిక నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో దాదాపు 15 వేల మంది ప్రాణాలు కోల్పోయి, 80 వేల ఇండ్లు ధ్వంసం అయ్యాయి. 1860లో నిర్మించిన నిజాం ఆసుపత్రిని ధ్వంసం చేసి అఫ్జల్ ముసల్లం జంగ్, చాదర్ ఘాట్ వంతెనలు కొట్టుకుపోయాయి. స్థానిక భాషలో ఈ వరదలను “తుగ్యాని సితంబర్” అని పిలిచేవారు. ఆనాటి వరదల్లో ఉస్మానియా ఆసుపత్రిలో 200 ఏండ్ల నాటి చింత చెట్టు ఎక్కి 150 మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ విపత్కర పరిస్థితిని చూసి హైదరాబాద్ స్టేట్ ఆస్థాన జ్యోతిష్యుడు “జుమర్ లాల్ తివారి” సలహా మేరకు నిజాం రాజు “మహబూబ్ అలీ ఖాన్” ధోతి ధరించి మూసీ నదిని శాంతింపజేసేందుకు హిందూ మతాచార ప్రకారం నదికి పూలు, పండ్లు, కొబ్బరి కాయలు, పట్టు చీర, బంగారం, వెండి, ముత్యాలు సమర్పించి, పూజలు నిర్వహించారు. వరద సంక్షోభ సమయంలో నిజాం రాజు తన రాజభవనం తెరిచి ప్రజలను ఆదుకోవడం జరిగింది. ఇలాంటి వరదలు మరల రాకుండా 1912 లో “సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు” ఏర్పాటు చేసి నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. నగర పునర్నిర్మాణం కొరకు సలహాలు సహకారం అందించాలని నిజాం రాజు అలనాటి ప్రఖ్యాత ఇంజినీర్ ” మోక్షగుండం విశ్వేశ్వరయ్య” ను ఆహ్వానించి ఆయన సలహా మేరకు హైదరాబాద్ కు ఉత్తరాన కొన్ని మైళ్ళ దూరంలో రిజర్వాయర్లు నిర్మించారు. ప్రఖ్యాత ఇంజనీర్ “నవాబ్ జంగ్ బహదూర్” ఆధ్వర్యంలో 1920లో మూసీ నదికి అడ్డంగా “ఉస్మాన్ సాగర్” 1927లో ఈసీ (మూసి ఉపనది) పై “హిమాయత్ సాగర్” నిర్మించి హైదరాబాద్ కు తాగు నీటితో పాటు వరదలు నియంత్రించబడ్డాయి.

✍ ఆళవందార్ వేణు మాధవ్,
📱 8686051752,📍హైదరాబాద్.
– మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
ఆర్.కె న్యూస్, నస్పూర్: రాజకీయాలకు అతీతంగా ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలిపారు. గురువారం నస్పూర్ మున్సిపాలిటీలోని 19, 14, 22, 13, 24, 25, 15 వార్డుల్లో కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ పండుగ కానుకగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు జిల్లా ప్రజలకు ప్రేమ్ సాగర్ రావు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని అన్నారు. వరదల సమయంలో అధికారులు ఎవరూ స్పందించకపోయినా తాము స్పందించామన్నారు. ఎండాకాలంలో ప్రజలకు నీటి ఎద్దడి తీర్చేందుకు వాటర్ ట్యాంకుల ద్వారా గోదావరి నీటిని అందించామన్నారు. ఎన్నికల్లో గెలిచిన వాళ్లు సైతం కరోనా, వరద ప్రభావిత సమయాల్లో పారిపోతే ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ కార్యకర్తలు సేవలు అందించారని గుర్తు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమ సాగర్ రావు ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
– మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్
ఆర్.కె న్యూస్ ,నస్పూర్: ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ స్పష్టం చేశారు. గురువారం రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపాలిటీ సింగపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ ఆయన సతీమణి స్రవంతితో కలిసి స్థానిక మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతూ నస్పూర్ మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారం బీజేపీతోనే సాధ్యమని, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, కరోనా సమయంలో కోవిడ్ సోకిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశామని, చనిపోయిన వారికి ఆర్థిక సహాయం, వరద బాధితులకు సహాయం, నిరుద్యోగులకు ఉచిత పోలీస్, గ్రూప్స్ శిక్షణ, ఉచిత వైద్య శిబిరాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్రం రమేష్, పానుగంటి మధు, కుర్రే చక్రి, రంగు రమేష్, పులి కిష్టయ్య, మర్త నారాయణ, మార్త శంకర్, కుర్రే లింగయ్య, ముత్యాల రాయమల్లు, కోట శంకర్, జుమ్మిడి రాజేష్, కొండ వెంకటేష్, అంబాల సాగర్, సిరికొండ రాజు, రూప దేవి, స్వప్న రెడ్డి, సుమలత, కొంతం మహేందర్, బద్రి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108 జయంతి వేడుకలు నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనకై అంకితభావం, నిజాయితీగా కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ప్రశంసించారు. కేవలం తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొన్నారని, చట్టసభల్లో గళమెత్తి తన పదవులు తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలకాని బొడ్డయ్య, ప్రధాన కార్యదర్శి వేముల సురేష్, శ్రీలక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయ కమిటీ అధ్యక్షులు సిరిపురం రామన్న, ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, కోశాధికారి కుసుమ శంకర్, నల్ల సంపత్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: సిమెంట్ ఇటుకల చాటున గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ రెమా రాజేశ్వరి తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం సీపీ మాట్లాడుతూ, ఒడిశా రాష్ట్రం, మల్కన్ గిరి జిల్లా, చితాపరి గ్రామానికి చెందిన చిత్రసేన్ క్రిసాని, జగబందు క్రిసాని అనే అన్నదమ్ములు ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలించేవారని, ఈ నెల 22న రవాణా చేస్తున్న క్రమంలో రాత్రి శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం దగ్గర నేషనల్ హైవే పక్కన టైరు పంక్చర్ కావడంతో ట్రాక్టర్ ను అక్కడే వదిలిపెట్టి వెళ్లారని తెలిపారు. ఈనెల 23న పెట్రోలింగ్ చేస్తున్న శ్రీరాంపూర్ ఎస్ఐ ట్రాక్టర్ వద్ద ఎవరు లేకపోవడంతో సిబ్బందితో పోలీస్ స్టేషన్ కు తరలించారని, ట్రాక్టర్ కోసం ఎవరు రాకపోవడంతో అనుమానంతో 25న తనిఖీ చేయగా సిమెంట్ ఇటుకల కింద టేపు చుట్టి ఉంచిన 93 (465 కిలోలు) గంజాయి ప్యాకెట్లు కనిపించాయని తెలిపారు. అనంతరం గెజిటెడ్ ఆఫీసర్ సమక్షంలో పంచనామా నిర్వహించామన్నారు. గంజాయి విలువ 93 లక్షలు ఉంటుందని తెలిపారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తెలంగాణ మీదుగా రవాణా చేస్తున్నారని, గంజాయి అక్రమ రవాణాలో కీలక వ్యక్తులు ఈశ్వర్, గురులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్, జైపూర్ ఏసీపీ బి. మోహన్, శ్రీరాంపూర్ సిఐ జి. రమేష్ బాబు, టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ సుధాకర్, ఎస్ఐలు ఎం. ప్రసాద్, కె. రాజేష్, ఉపేందర్, రాజ వర్ధన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం వాటాను కార్మికులకు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏరియా వైస్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టిబిజికెఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టిబిజికెఎస్ నాయకులు మాట్లాడుతూ కోల్ ఇండియాలో ఎన్నో హక్కులు సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కార్మికవర్గం కేసీఆర్ వెంటే ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం చర్చల ప్రతినిధి వెంగల కుమారస్వామి,బ్రాంచ్ సెక్రటరీలు పానుగంటి సత్తయ్య,భూపతి అశోక్, కానుగంటి చంద్రయ్య, మహిపాల్ రెడ్డి, చీఫ్ ఆర్గనైజ్ సెక్రటరీలు జగదీశ్వర్ రెడ్డి, తొంగల రమేష్, శ్రీనివాస్ యాదవ్, ఏరియా నాయకులు నీలం సదయ్య, పొగాకు రమేష్,పిట్ సెక్రెటరీలు మహేందర్ రెడ్డి, మెండె వెంకటి, వెంకటేశ్వరరావు, ఇప్ప భూమయ్య, జంపయ్య, నాయకులు ఒల్లాల రవి, మహేష్ రాజ్, ఉత్తేజ్ రెడ్డి, ప్రసాద్, కాల్వ శ్రీను, శంకరయ్య, తిరుపతి రావు సంతోష్,వెంకటరమణ రెడ్డి, యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: ప్రముఖ ఇంద్రజాలికుడు, రామకృష్ణాపూర్ సింగరేణి పాఠశాల పూర్వ విద్యార్థి మ్యాజిక్ భాస్కర్ ను మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో సీసీసీ సింగరేణి పాఠశాల పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా పాఠశాల పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, స్థానిక ప్రైవేటు పాఠశాలలు, సింగరేణి పాఠశాలల విద్యార్థులకు మ్యాజిక్ షో ద్వారా పిల్లలను మొబైల్, టీవీల నుంచి దూరం చేస్తూ, మూఢనమ్మకాల నుండి చైతన్య పరిచే దిశలో చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్ రావు, కార్యదర్శి దొనికెన సమ్మయ్య, శ్యాంసుందర్ రెడ్డి, టి.శంకర్, గోసిక మనోజ్, ప్రవీణ్, పెండ్లి సురేందర్, కృష్ణవేణి, రజిత, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: ప్రథమ చికిత్స కోర్సులో శిక్షణ పొంది, ఉత్తీర్ణులైన 24 మంది మహిళా ఉద్యోగులకు ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తుందని, అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రథమ చికిత్స పై అవగాహన ఉండాలనే ఉద్దేశ్యంతో వారికి ప్రథమ చికిత్స శిక్షణా తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. శిక్షణ తరగతులు పూర్తిచేసుకుని పరీక్షలో ఉత్తీర్ణులైన సర్టిఫికెట్లు పొందడం అభినందనీయమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని, సింగరేణి సంస్థలో మహిళలు అన్ని పనులు చేస్తున్నారని అన్నారు. సంస్థ మహిళా ఉద్యోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. మహిళలు వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కె. రఘు కుమార్, డీజీఎం (ఐఈడి) చిరంజీవులు, డివైసీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు, వృత్తి శిక్షణా కేంద్రం ఎస్వోఎం కల్లూరి వెంకట రామారావు, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ హనుమాన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



