వెండి తెర పై బొగ్గు జీవితాలు

బొగ్గు భూమిలో లభించే ఖనిజం. ఇంధన ఉత్పత్తిలో ప్రముఖ భూమిక పోషిస్తుంది. భారతదేశంలో దామోదర నది ఒడ్డున పశ్చిమ బెంగాల్ లో రాణి గంజ్ గని ద్వారా 1774 నుంచి మెస్సర్స్ సమ్మర్ హిట్లీ ఆఫ్ ఇండియా కంపనిచే బొగ్గు తవ్వకాలు ప్రారంభించి, ప్రస్తుతం కోల్ ఇండియా అనుబంధ సంస్థల ఆధీనంలో, దక్షిణ భారతదేశంలో సింగరేణి కాలరీస్ కంపెనీ ద్వారా 1889 నుంచి బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. బొగ్గు గని కార్మికులు అనుభవిస్తున్న కష్టాలు, వారు ఎదుర్కొనే ప్రమాదాలు, అధికారులచే శ్రమ దోపిడీ పై బాలీవుడ్ లో 1980 దశకంలో ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన “కాలా పత్తర్”తో మొదలైంది. ఝార్ఖండ్ లోని 1979 లో చసనాలా బొగ్గు గనిలో నీటి ప్రమాదంలో దాదాపు 300 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతం పై “కాలా పత్తర్” సినిమా నిర్మించడం జరిగింది. ఇప్పటివరకు బాలీవుడ్ కేవలం ప్రేమ, ముంబై మాఫియా, ఇండో-పాక్, ఇండో-చైనా యుద్దాలపై చిత్రాలు వచ్చాయి తప్ప బొగ్గు గనుల కార్మికుల గురించి ఏ చిత్రం రాలేదు. ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో మాఫియా ముఠాల వైరం పై 2014లో మనోజ్ బాజ్ పేయి, నవాజ్ ఉద్దీన్ సిధ్దికి నటించిన “గ్యాంగ్ ఆఫ్ వాస్నేపూర్” వినోద్ ఖన్నా, సునిల్ శెట్టి నటించిన “కోయాలంచల్” చిత్రం,శక్తి వంతమైన బొగ్గు మాఫియా చుట్టూ తిరుగుతుంది. ధన్ బాద్ లో అక్రమ బొగ్గు తవ్వకాలు, అక్రమ రవాణా గురించి పై చిత్రీకరించారు. రణవీర్ సింగ్, అర్జున్ కపూర్ నటించిన “గుండే” చిత్రంలో నడుస్తున్న రైళ్లలో బొగ్గు దొంగతనం చేసి మాఫియా డాన్ గా మారిన ఇద్దరు మిత్రుల కథగా విడుదలై హిట్ అయ్యింది. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటి సారిగా కృష్ణంరాజు నటించిన “చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా” కొత్తగూడెం ప్రాంతంలో చిత్రీకరించారు. ప్రముఖ నటుడు బాలకృష్ణ, విజయశాంతి నటించిన చిత్రం “నిప్పు రవ్వ” కూడా బొగ్గు గని ప్రమాదం, దళారీల శ్రమ దోపిడీ గురించి తీసిందే. సింగరేణి బొగ్గు గని కార్మికుల నిజ జీవితాలను వెండి తెర పై “చీకటి సూర్యులు”గా చూపించిన ఘనత విప్లవ నటుడు ఆర్. నారాయణ మూర్తి కే దక్కుతుంది. ఈ సంవత్సరం  నాని నటించిన “దసరా” చిత్రం కూడా బొగ్గు గని ప్రాంతంలో ఉన్న కార్మికుల కథే. ఇందులో పూర్తిగా సింగరేణి కార్మికుల యాసతో కూడిన భాష హైలెట్, అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాల్లో బొగ్గు గని చూపించినప్పటికీ బొగ్గు గని చిత్రాలు తక్కువగా వచ్చాయి. ప్రభాస్ నటిస్తున్న “సలార్” చిత్రంలో కూడా గోదావరి ఖని ఓపెన్ కాస్ట్ దృశ్యాలు చిత్రీకరించారు. ప్రస్తుతం దేశం యావత్తు అక్టోబర్ 6 న విడుదల కాబడుతున్న అక్షయ్ కుమార్ నటిస్తున్న “మిషన్ రాణి గంజ్” చిత్రంలో 1989 నవంబర్ 13 న పశ్చిమ బెంగాల్ రాణి గంజ్ గని నీటి ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను ఒక క్యాప్సిల్స్ ద్వారా బయటకు తీసుకొని రక్షించడం ఇందులో కథ. ఈ చిత్రం రిటైర్డ్ ఇంజినీర్, ఐ ఎస్ ఎం విద్యార్థి జస్వంత్ సింగ్ గిల్ జీవితం ఆధారంగా నిర్మించారు. జస్వంత్ సింగ్ గిల్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించారు.వెండి తెర పై కాకుండా ప్రముఖ వెబ్ సిరీస్ నిర్మాత ఏక్తా కపూర్ “ధన్ బాద్” వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ఒకప్పుడు బొగ్గు ప్రాంతం అంటే చిన్న చూపు చూసిన వారు బొగ్గు ప్రాంతాలను షూటింగ్ స్పాట్ గా గుర్తించడం గొప్ప పరిణామం.


✍ ఆళవందార్ వేణు మాధవ్,

📱 8686051752,📍హైదరాబాద్.

AD 01

Follow Me

images (40)
images (40)

వెండి తెర పై బొగ్గు జీవితాలు

బొగ్గు భూమిలో లభించే ఖనిజం. ఇంధన ఉత్పత్తిలో ప్రముఖ భూమిక పోషిస్తుంది. భారతదేశంలో దామోదర నది ఒడ్డున పశ్చిమ బెంగాల్ లో రాణి గంజ్ గని ద్వారా 1774 నుంచి మెస్సర్స్ సమ్మర్ హిట్లీ ఆఫ్ ఇండియా కంపనిచే బొగ్గు తవ్వకాలు ప్రారంభించి, ప్రస్తుతం కోల్ ఇండియా అనుబంధ సంస్థల ఆధీనంలో, దక్షిణ భారతదేశంలో సింగరేణి కాలరీస్ కంపెనీ ద్వారా 1889 నుంచి బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. బొగ్గు గని కార్మికులు అనుభవిస్తున్న కష్టాలు, వారు ఎదుర్కొనే ప్రమాదాలు, అధికారులచే శ్రమ దోపిడీ పై బాలీవుడ్ లో 1980 దశకంలో ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన “కాలా పత్తర్”తో మొదలైంది. ఝార్ఖండ్ లోని 1979 లో చసనాలా బొగ్గు గనిలో నీటి ప్రమాదంలో దాదాపు 300 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతం పై “కాలా పత్తర్” సినిమా నిర్మించడం జరిగింది. ఇప్పటివరకు బాలీవుడ్ కేవలం ప్రేమ, ముంబై మాఫియా, ఇండో-పాక్, ఇండో-చైనా యుద్దాలపై చిత్రాలు వచ్చాయి తప్ప బొగ్గు గనుల కార్మికుల గురించి ఏ చిత్రం రాలేదు. ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో మాఫియా ముఠాల వైరం పై 2014లో మనోజ్ బాజ్ పేయి, నవాజ్ ఉద్దీన్ సిధ్దికి నటించిన “గ్యాంగ్ ఆఫ్ వాస్నేపూర్” వినోద్ ఖన్నా, సునిల్ శెట్టి నటించిన “కోయాలంచల్” చిత్రం,శక్తి వంతమైన బొగ్గు మాఫియా చుట్టూ తిరుగుతుంది. ధన్ బాద్ లో అక్రమ బొగ్గు తవ్వకాలు, అక్రమ రవాణా గురించి పై చిత్రీకరించారు. రణవీర్ సింగ్, అర్జున్ కపూర్ నటించిన “గుండే” చిత్రంలో నడుస్తున్న రైళ్లలో బొగ్గు దొంగతనం చేసి మాఫియా డాన్ గా మారిన ఇద్దరు మిత్రుల కథగా విడుదలై హిట్ అయ్యింది. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటి సారిగా కృష్ణంరాజు నటించిన “చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా” కొత్తగూడెం ప్రాంతంలో చిత్రీకరించారు. ప్రముఖ నటుడు బాలకృష్ణ, విజయశాంతి నటించిన చిత్రం “నిప్పు రవ్వ” కూడా బొగ్గు గని ప్రమాదం, దళారీల శ్రమ దోపిడీ గురించి తీసిందే. సింగరేణి బొగ్గు గని కార్మికుల నిజ జీవితాలను వెండి తెర పై “చీకటి సూర్యులు”గా చూపించిన ఘనత విప్లవ నటుడు ఆర్. నారాయణ మూర్తి కే దక్కుతుంది. ఈ సంవత్సరం  నాని నటించిన “దసరా” చిత్రం కూడా బొగ్గు గని ప్రాంతంలో ఉన్న కార్మికుల కథే. ఇందులో పూర్తిగా సింగరేణి కార్మికుల యాసతో కూడిన భాష హైలెట్, అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాల్లో బొగ్గు గని చూపించినప్పటికీ బొగ్గు గని చిత్రాలు తక్కువగా వచ్చాయి. ప్రభాస్ నటిస్తున్న “సలార్” చిత్రంలో కూడా గోదావరి ఖని ఓపెన్ కాస్ట్ దృశ్యాలు చిత్రీకరించారు. ప్రస్తుతం దేశం యావత్తు అక్టోబర్ 6 న విడుదల కాబడుతున్న అక్షయ్ కుమార్ నటిస్తున్న “మిషన్ రాణి గంజ్” చిత్రంలో 1989 నవంబర్ 13 న పశ్చిమ బెంగాల్ రాణి గంజ్ గని నీటి ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను ఒక క్యాప్సిల్స్ ద్వారా బయటకు తీసుకొని రక్షించడం ఇందులో కథ. ఈ చిత్రం రిటైర్డ్ ఇంజినీర్, ఐ ఎస్ ఎం విద్యార్థి జస్వంత్ సింగ్ గిల్ జీవితం ఆధారంగా నిర్మించారు. జస్వంత్ సింగ్ గిల్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించారు.వెండి తెర పై కాకుండా ప్రముఖ వెబ్ సిరీస్ నిర్మాత ఏక్తా కపూర్ “ధన్ బాద్” వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ఒకప్పుడు బొగ్గు ప్రాంతం అంటే చిన్న చూపు చూసిన వారు బొగ్గు ప్రాంతాలను షూటింగ్ స్పాట్ గా గుర్తించడం గొప్ప పరిణామం.


✍ ఆళవందార్ వేణు మాధవ్,

📱 8686051752,📍హైదరాబాద్.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment