నస్పూర్, ఆర్.కె న్యూస్: రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికై, బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ధర్ని మధుకర్, సల్ల రమ్య బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో (కలెక్టరేట్) కలెక్టర్ ఛాంబర్కు వెళ్లిన వారు, ఆయనకు మొక్కలను అందజేశారు.
7







