సోన్, ఆర్.కె న్యూస్: ఆయిల్ పామ్ పంట రైతులకు అత్యంత లాభదాయకమైన పంట అని మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో) జి. వినోద్ కుమార్ తెలిపారు. సోన్ మండలంలోని పాకపట్ల గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) రాజ్కుమార్తో కలిసి రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటలో పెట్టుబడి తక్కువగా ఉండి, దిగుబడి అధికంగా ఉంటుందని తెలిపారు. ఒకసారి మొక్కలు నాటితే సుమారు 30 సంవత్సరాల వరకు నిరంతర ఆదాయం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు వివిధ రకాల ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందిస్తున్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పలువురు రైతులు ఆయిలపామ్ పంట సాగు కోసం దరఖాస్తు చేసుకున్నారు ఆయిల్ పామ్ పంటకు మార్కెటింగ్ సౌకర్యం అందుబాటులో ఉండటంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని వివరించారు. నీటి వనరులు ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టి ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని కోరారు.ఈ కార్యక్రమం లో రైతులు లోకేష్,సుధాకర్, సృజన్ , మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.
Daily Archives



