సొన్, ఆర్.కె న్యూస్: మద్యం సేవించి వాహనం నడిపిన లారీ డ్రైవర్ కు 20 రోజులు జైలు శిక్ష పడిందని ఎస్సై గోపి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఈనెల 6వ తేదీన వాహనాలను తనిఖీ చేస్తుండగా అదిలాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనము నడుపుతూ పట్టుబడినాడు. అతనిని మంగళవారం నిర్మల్ కోర్ట్ నందు హాజరు పరచగా మెజిస్ట్రేట్ అతనికి 20 రోజులు జైలు శిక్ష విధించడం జరిగిందని, ప్రతి వాహనదారుడు మద్యం సేవించి వాహనాలను నడపరాదని, రూల్స్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై తెలిపారు.
7







