సోన్, ఆర్.కె న్యూస్: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గురువారం ఎంపీపీఎస్ సిద్దులకుంట పాఠశాలలో బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బ్యాండ్ మేళాలు, పోతురాజుల నృత్యాలతో గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. విద్యార్థినుల బోనాల ఊరేగింపు, పోతురాజుల వేషధారణతో విద్యార్థులు చేసిన విన్యాసాలు గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామస్థులు వారి ప్రదర్శనను తిలకించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాటికొండ రాజేశ్వర్, ఉపాధ్యాయులు పి. నర్సారెడ్డి, గృశాలి, విందు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
6 August 2026
వ్యాపారులకు నోటీసులు అందజేత
సోన్, ఆర్.కె న్యూస్: “ప్లాస్టిక్ను నిషేధిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” అని ఎంపీఓ జడి జ్యోతి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని న్యూ వెల్మల్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. గ్రామంలోని వ్యాపార, దుకాణ సముదాయాల వద్దకు వెళ్లి, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే నష్టాలపై దుకాణదారులకు అవగాహన కల్పించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను విక్రయించవద్దని హెచ్చరించారు. దుకాణాల వద్ద పరిశుభ్రత పాటించాలని, లేనిపక్షంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం చర్యలు తీసుకుని జరిమానా విధిస్తామని తెలిపారు. అనంతరం దుకాణ యజమానులకు నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భూపాల్ రెడ్డి, కారోబార్ ప్రవీణ్, జిలకర వేణు, భాస్కర్, భోజన్న, ధోని భీమేష్, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
- ఒడిశా నుంచి తెలంగాణకు చేరిన తొలి రైల్వే రేకు
- సింగరేణి విస్తరణకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం: భట్టి విక్రమార్క
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. ఒడిశా రాష్ట్రంలోని నైనీ గని నుంచి లోడ్ చేసిన తొలి బొగ్గు రైల్వే రేకు సుమారు 1,131 కిలోమీటర్లు ప్రయాణించి మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (ఎస్టీపీపీ) గురువారం ఉదయం చేరుకుంది. ఇతర రాష్ట్రంలోని సంస్థ గని నుంచి తెలంగాణకు బొగ్గు సరఫరా కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. హిందోల్ రైల్వే సైడింగ్లో లోడ్ చేసిన 59 వేగన్ల ద్వారా సుమారు 4,000 టన్నుల జి-10 గ్రేడ్ బొగ్గు చేరింది. విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు వీడియో సందేశం ద్వారా కార్మికులకు, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని, సింగరేణి పటిష్టతకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. ఇటీవల తాడిచెర్ల-2, మణుగూరు డిప్సైడ్ బ్లాకులను సాధించామని, క్రిటికల్, రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలోనూ అడుగుపెట్టి సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతామన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న తొలి రైల్వే రేకుకు డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, ఎం. తిరుమలరావు ఘన స్వాగతం పలికి, అన్లోడింగ్ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్ అవసరాలకు పెద్దపీట వేస్తున్నామని, ప్రస్తుతం మరో 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ యూనిట్ నిర్మాణంలో ఉందని వారు తెలిపారు. ప్రశాంతంగా సాగిన ఈ రవాణాకు సహకరించిన తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు, రైల్వేలకు సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ ఈడి చిరంజీవి, జీఎం నరసింహ రావు, జీఎం సూర్యనారాయణ రాజు, గుర్తింపు కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రం, కనీస వేతనాల అమలు కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్, అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్, ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- నస్పూర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న
- జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నస్పూర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన చూపిన బాటలోనే ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జయశంకర్ ఆలోచనలు, సేవలు తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కే. సురేందర్ రెడ్డి, నాయకులు బండి రమేష్, రమేష్, అహ్మద్, పూధరి కుమార్, రుకుం తిరుమల్, పానుగంటి సత్తయ్య, ఆకునూరి సంపత్, భానుచందర్, రఫీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.



