నిర్మల్, ఆర్.కె న్యూస్: నిర్మల్ ఆదర్శనగర్లో గల వశిష్ట హైస్కూల్లో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ నిలువుటద్దమని పాఠశాల చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ అనగానే అందరికీ గుర్తువచ్చేది బోనాల పండుగేనని, రాష్ట్రంలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఉత్సవాలు రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ వైభవంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సంబరాలలో భాగంగా విద్యార్థులు పోతురాజులు, అమ్మవార్ల వేషధారణలతో అలరించి తల్లిదండ్రులను ఆకట్టుకున్నారు. ముందుగా దుర్గామాత చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి బోనాలు సమర్పించి, ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జి. మాధవి, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Daily Archives



