- మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరుతుందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్లో లబ్ధిదారులు శీలం గట్టక్క, గట్టయ్య దంపతులు పూర్తి చేసుకున్న నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఇంటిని ప్రారంభించి, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాచకొండ గోపాల్ రావు, హౌసింగ్ బోర్డు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకార మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మహిళలకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, మత్స్యకారుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ భవన నిర్మాణం ద్వారా మహిళా మత్స్యకారులకు శిక్షణ, సమావేశాలు మత్స్య ఉత్పత్తుల నిల్వకు అనుకూలంగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, సర్పంచ్ అంపోలి వనజా కృష్ణ ప్రసాద్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మత్స్యకార సంఘం నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.