సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండల కేంద్రంలో గల రైతు వేదికలో రైతులకు ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ యాప్, ఎరువుల బుకింగ్ విధానంపై అవగాహన ఏవో వినోద్ కుమార్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి జి. వినోద్ కుమార్ రైతులకు యాప్ వినియోగం, ఎరువుల బుకింగ్ విధానం, బుకింగ్ అనంతరం ఎరువులు పొందే ప్రక్రియను వివరించారు. కొత్త యాప్లో యూరియాతో పాటు డిఎపి, కాంప్లెక్స్ ఎరువులకు కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకుని ఉండాలని, దీనిలో ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో కానీ, ఫార్మర్ ఐడితో కానీ, లాగిన్ కావొచ్చని తెలిపారు. దీనిలో సర్వే నెంబర్ వారీగా పంటల వివరాలు సర్వే నెంబర్ వారీగా ఎరువులను బుకింగ్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న అనంతరం సంబంధిత డీలర్ వద్ద బుకింగ్ వివరాలు క్యూఆర్ కోడ్ చూపించి ఎరువులు పొందవచ్చని తెలిపారు. రైతులు ఎరువుల కోసం ముందస్తు బుకింగ్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఉమా మహేశ్వరి, రైతులు తిరుపతి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.



