– శ్రీరాంపూర్ ఎస్వోటు జీఎం కె. రఘు కుమార్
– భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం
ఆర్.కె న్యూస్, నస్పూర్: 2023-24 ఆర్ధిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని శ్రీరాంపూర్ ఎస్వోటు జీఎం కె. రఘు కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ ఎస్వోటు జీఎం మాట్లాడుతూ, గత నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంపూర్ ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగిందని తెలిపారు. రాబోయే 6 నెలలు బొగ్గు ఉత్పత్తికి కీలకమని అన్నారు. సెప్టెంబర్ నెలలో శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు ఉత్పత్తి 89 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఆర్కే5 గని 105 శాతం, ఆర్కే6 గని 115 శాతం, ఆర్కే7 గని 102 శాతం, ఆర్కే న్యూటెక్ గని 106 శాతం, ఎస్సార్పీ 1 గని 74 శాతం, ఎస్సార్పీ3 గని 92 శాతం, ఐకె1ఎ గని 79 శాతంతో భూగర్భ గనులు 96 శాతం సాధించాయని, ఎస్సార్పీ ఓసిపి 70 శాతం, ఐకె ఓసిపి 125 శాతంతో శ్రీరాంపూర్ ఏరియా 89 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత నెలలో ఆర్కే 8, నస్పూర్ డిస్పెన్సరీలో 3 లక్షల విలువ గల కొత్త ఈసీజీ యంత్రాలు అందుబాటులోకి తెచ్చామని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా 500 మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశామని, గైర్హాజరు కార్మికుల కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించమని తెలిపారు. గత నెలలో 41 మంది ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామక పత్రాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిజీఎంలు అరవింద్ రావు, చిరంజీవులు, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ పిఓ కాంత రావు తదితరులు పాల్గొన్నారు.
221