ఐటీ దాడులు సరికాదు

మచ్చలేని నాయకుడు, నిజాయితీగల వ్యాపారి డాక్టర్ వివేక్ వెంకటస్వామి పై ఐటీ దాడులు చేయడం సరికాదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకట స్వామికి వస్తున్న ప్రజాధారణ చూసి భయపడిన అధికార పార్టీ నాయకులు వివేక్ వెంకటస్వామి ప్రచారాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగా ఐటీ దాడులు జరిగాయని తెలిపారు. ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గలలోని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మాల మహానాడు కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితుల సాధికారత, అభివృద్ది కోసం దేశంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని చిత్తశుద్దితో అమలు చేసిందని, అలాంటి పార్టీ అధికారంలో ఉంటే దళితులకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలు మధ్యలో వదిలివేస్తూ మోసం చేసిందన్నారు. ప్రతిసారి ఎన్నికల్లో కొత్త పథకం తెరపైకి తెస్తూ, దళితులను వంచిస్తూ, ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు. ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేసే కాంగ్రెస్ పార్టీకి మాలలు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి మల్లయ్య, నాయకులు పొట్ట మధుకర్, దమ్మ నారాయణ, మినుముల శాంతి కుమార్, బైరం రవి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

ఐటీ దాడులు సరికాదు

మచ్చలేని నాయకుడు, నిజాయితీగల వ్యాపారి డాక్టర్ వివేక్ వెంకటస్వామి పై ఐటీ దాడులు చేయడం సరికాదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకట స్వామికి వస్తున్న ప్రజాధారణ చూసి భయపడిన అధికార పార్టీ నాయకులు వివేక్ వెంకటస్వామి ప్రచారాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగా ఐటీ దాడులు జరిగాయని తెలిపారు. ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గలలోని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మాల మహానాడు కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితుల సాధికారత, అభివృద్ది కోసం దేశంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని చిత్తశుద్దితో అమలు చేసిందని, అలాంటి పార్టీ అధికారంలో ఉంటే దళితులకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలు మధ్యలో వదిలివేస్తూ మోసం చేసిందన్నారు. ప్రతిసారి ఎన్నికల్లో కొత్త పథకం తెరపైకి తెస్తూ, దళితులను వంచిస్తూ, ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు. ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేసే కాంగ్రెస్ పార్టీకి మాలలు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి మల్లయ్య, నాయకులు పొట్ట మధుకర్, దమ్మ నారాయణ, మినుముల శాంతి కుమార్, బైరం రవి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment