వయోధికుల సమస్యల పరిష్కారమే అసోసియేషన్ ధ్యేయం

  • కాచవాని సింగారంలో డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్, ఆర్.కె న్యూస్: తెలంగాణలోని వయోధికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుందని ఆ సంస్థ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. బుధవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాచవాని సింగారంలో నిర్వహించిన కార్యక్రమంలో అసోసియేషన్ నూతన డైరీని రాష్ట్ర అధ్యక్షుడు తోట రంగయ్య ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధుల సంక్షేమం కోసం ఉమ్మడి కార్యాచరణ రూపొందించనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ మాట్లాడుతూ.. గతంలో అమల్లో ఉన్న ప్రయాణ రాయితీలను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో వయోధికులకు టికెట్ ధరపై 50 శాతం రాయితీ కల్పించాలని, రైల్వే ప్రయాణాల్లో నిలిపివేసిన రాయితీలను తిరిగి ప్రారంభించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వయోధికుల హక్కుల రక్షణ కోసం ఈ నూతన అసోసియేషన్ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. డైరీ ప్రచురణలో కీలక పాత్ర పోషించిన ముత్యాల గౌడ్, కృష్ణ మూర్తిలను ఈ సందర్భంగా సంఘ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. ముత్యాల గౌడ్, సంయుక్త కార్యదర్శి వి. ఇన్నా రెడ్డి, మేడ్చల్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి టి. కృష్ణ మూర్తి, ఘాట్ కేసర్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, సభ్యులు వి. రాములు, విద్యా సాగర్, సి.హెచ్. రాములు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

వయోధికుల సమస్యల పరిష్కారమే అసోసియేషన్ ధ్యేయం

  • కాచవాని సింగారంలో డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్, ఆర్.కె న్యూస్: తెలంగాణలోని వయోధికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుందని ఆ సంస్థ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. బుధవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాచవాని సింగారంలో నిర్వహించిన కార్యక్రమంలో అసోసియేషన్ నూతన డైరీని రాష్ట్ర అధ్యక్షుడు తోట రంగయ్య ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధుల సంక్షేమం కోసం ఉమ్మడి కార్యాచరణ రూపొందించనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ మాట్లాడుతూ.. గతంలో అమల్లో ఉన్న ప్రయాణ రాయితీలను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో వయోధికులకు టికెట్ ధరపై 50 శాతం రాయితీ కల్పించాలని, రైల్వే ప్రయాణాల్లో నిలిపివేసిన రాయితీలను తిరిగి ప్రారంభించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వయోధికుల హక్కుల రక్షణ కోసం ఈ నూతన అసోసియేషన్ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. డైరీ ప్రచురణలో కీలక పాత్ర పోషించిన ముత్యాల గౌడ్, కృష్ణ మూర్తిలను ఈ సందర్భంగా సంఘ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. ముత్యాల గౌడ్, సంయుక్త కార్యదర్శి వి. ఇన్నా రెడ్డి, మేడ్చల్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి టి. కృష్ణ మూర్తి, ఘాట్ కేసర్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, సభ్యులు వి. రాములు, విద్యా సాగర్, సి.హెచ్. రాములు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment