వేమనపల్లి, ఆర్.కె న్యూస్: వేమనపల్లి తహసీల్దార్ గా బి.సాయి బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన సాయిబాబు లెక్టరేట్ కి బదిలీ కాగా నాయబ్ తహసీల్దార్ సాయికృష్ణ కు తహసీల్దార్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మళ్ళీ తిరిగి వేమనపల్లి మండల తహసీల్దార్ గా సాయిబాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ భూభారతి, ఇతర సర్టిఫికెట్లు, వివిధ అవసరాల కోసం వచ్చేవారు నేరుగా తనను కలవొచ్చని చెప్పారు. ఈ సందర్భంగా రెవిన్యూ సిబ్బంది తహాసీల్దార్ కి స్వాగతం పలికారు. వీరిలో నాయబ్ తహసీల్దారు సాయి కృష్ణ, ఆర్ఐ ఖాళిక్ రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.
13







