- ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో ప్రగతి పథంలోకి డివిజన్
- ఇంటింటికీ కాంగ్రెస్ అభివృద్ధి పథకాలు.. కుమారస్వామి ఎన్నికల ప్రచారం
నస్పూర్, ఆర్.కె న్యూస్: 33వ డివిజన్ కార్పొరేటర్గా ఆశీర్వదించి గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారంతో డివిజన్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి ఎంబడి కుమారస్వామి అన్నారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్లో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. చేయి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచిర్యాల నియోజకవర్గ ముఖచిత్రం మారిందని కుమారస్వామి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో నియోజకవర్గం ముందంజలో ఉందని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా హిత కార్యక్రమాలు ప్రజల చెంతకు చేరుతున్నాయని వివరించారు. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి డివిజన్ ప్రగతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ వ్యాప్తంగా పర్యటించిన అభ్యర్థికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అండదండలతో డివిజన్ లోని మౌలిక వసతులను మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.









