36వ డివిజన్లో ఇంటింటి ప్రచారం.. సింహం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన
నస్పూర్, ఆర్.కె న్యూస్: 36వ డివిజన్ సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని అడ్లకొండ కవిత-రవి గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్లో ఆమె విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆమె ఇంటింటికీ తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ అభివృద్ధికి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుతో తాను 36వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు అడ్లకొండ కవిత వెల్లడించారు. సింహం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో విజయం చేకూర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డివిజన్లో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రజా మద్దతుతో తన విజయం ఖాయమని అడ్లకొండ కవిత ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆమె వివరించారు. సింహం గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







