- తెబొగకాసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి
KYATHAM RAJESH
- ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు పోరాటం చేస్తామని ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఇంచార్జ్ జెట్టి శంకర్ రావు అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 5 గని పై కేంద్ర కార్యదర్శలు పిన్నింటి మల్లారెడ్డి, రామకృష్ణ, పిట్ కమిటీ సమన్వయంతో బుధవారం సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఇంచార్జ్ జెట్టి శంకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ, ఆర్.కె 5 గని కార్మికులు పెద్ద సంఖ్యలో సభ్యత్వం పొందారని, యూనియన్ స్కానర్ ద్వారా సభ్యత్వ రుసుము చెల్లించి స్వచ్ఛందంగా సభ్యులుగా చేరినట్లు పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల హక్కులు సాధించడమే తమ యూనియన్ లక్ష్యమని, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ నాయకత్వంలో సింగరేణిలో పేరుకుపోయిన అనేక సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపుదిద్దుకుంటుందని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా గుర్తింపు సంఘం కార్మికుల కోసం ఎలాంటి విధివిధానాలు చేపట్టలేదని ఆరోపించారు. సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం ఐఎన్టీయూసీతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర నాయకులు గరిగే స్వామి, తిరుపతి రాజు, ఏనుగు రవీందర్ రెడ్డి, పిన్నింటి మల్లారెడ్డి, రామకృష్ణ, శ్రీనివాసరావు, మహేందర్ రెడ్డి, పెద్దిరాజు, శ్రీధర్ల మల్లేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులు నలిమెల మహేష్ వర్మ
శ్రీరాంపూర్ ఓసీపీలో ఎస్. సి. ఎం. ఎల్.యు (ఐఎన్టీయూసీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం
- ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి
ఆర్ . కె న్యూస్, నస్పూర్: సింగరేణి సెక్యూరిటీ విభాగానికి వాసాల కనకయ్య అందించిన సేవలు మరువలేనివని శ్రీరాంపూర్ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ అండ్ పిసి సెక్యూరిటీ కార్యాలయ ప్రాంగణంలో పదవీ విరమణ పొందిన సెక్యూరిటీ విభాగం జమ్మేదార్ వాసాల కనకయ్యను ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్, పర్మినెంట్, ప్రైవేట్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ మాట్లాడుతూ, వృత్తిరీత్యా కనకయ్య క్రమశిక్షణతో విధులు నిర్వహించేవారని, సెక్యూరిటీ విభాగానికి ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. వాసాల కనకయ్య ను ఆదర్శంగా తీసుకొని సెక్యూరిటీ ఉద్యోగులు క్రమశిక్షణతో బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఇన్స్పెక్టర్ సిర్ర రాజయ్య, జమ్మేదారులు, పర్మినెంట్, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
- గుండెపోటు నివారణ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి
- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
- ఏఐటీయూసీ నాయకులు
- హిందూ ఉత్సవ సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చుంచు రాజ్ కిరణ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలోని శ్రీరాంపూర్ సాందీపని ఉన్నత పాఠశాల 2000-2001 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నస్పూర్ లోని బొమ్మరిల్లు ఫంక్షన్ హాల్ లో జరుపుకున్నారు. ఆదివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ మల్లెత్తుల రాజేంద్రపాణి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన స్నేహితులందరూ 25 సంవత్సరాలకు ముందు పదో తరగతిలో విద్యను అభ్యసించిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, తమ క్షేమ సమాచారాలు పంచుకుంటూ, ఎంతో సరదాగా ఆటపాటలతో గడిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ రేగళ్ల ఉపేందర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మల్లిక్, ముష్క మల్లేష్, పూర్వ విద్యార్థులు కే. తిరుపతి, కే. సురేష్, ఏ. మధుకర్, ఈ. రమేష్, సిద్దన సాగర్, అల్లాడి సురేష్, సుమలత, రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
- తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన చారి