ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని సెంట్రల్ నర్సరీలో ఏరియాలోని గనులు, విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో బతుకమ్మ ఆట పాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి, ఏరియా సేవా అధ్యక్షురాలు రాధాకుమారి, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) రవి ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ దసరా వేడుకల్లో భాగంగా బతుకమ్మ ఆట పాట కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, ఇందారం ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, ఇన్చార్జి డిజిఎం (పర్సనల్) రాజేశ్వర్ , పర్చేస్ శ్రీ చంద్రశేఖర్, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, సీనియర్ పీవో పి. కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
- గుర్తింపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. సీతారామయ్య
ఆర్.కె న్యూస్, నస్పూర్: గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భాగంగా కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని అన్నారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, వేజ్ బోర్డు శాశ్వత సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంగళవారం గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్.కె 5 గని పై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరైన గుర్తింపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ అవగాహన లేని కొన్ని కార్మిక సంఘాలు కార్మికులను అయోమయానికి గురి చేయడానికి, కార్మికుల్లో వారి మనుగడ కొరకు, కార్మికుల్లో ఏఐటియుసికి ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకే లాభాల వాటా పై తప్పుడు ప్రచారాలు చేశాయని అన్నారు. తాము గత 20 సంవత్సరాల నుండి కంపెనీకి వచ్చిన స్థూల లాభం, కంపెనీ అభివృద్ధి కొరకు ఉపయోగించే మొత్తాన్ని మినహాయించి నికర లాభాల మొత్తం నుండి కార్మికులకు పంచిన లాభాల వాటా శాతాన్ని తాము అన్ని గనులలో కార్మికులు అర్థమయ్యే విధంగా గోడ ప్రతులు వేసామని అన్నారు. కార్మికులను అయోమయానికి గురి చేయడానికి ప్రయత్నించిన కార్మిక సంఘాలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. గుర్తింపు కార్మిక సంఘంగా గుర్తింపు పత్రం 8 నెలలు ఆలస్యమైనప్పటికీ తాము కార్మికుల పక్షాన ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించామని, డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితిని 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచడానికి కృషి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా, ఏరియా కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, పిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగ్ రావు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్, ఎస్ అండ్ పిసి పిట్ కార్యదర్శి ఆడేపు మల్లికార్జున్, పిట్ సహాయ కార్యదర్శి లక్కిరెడ్డి సత్తిరెడ్డి, నాయకులు మాడగొని మల్లేష్, శ్రీకాంత్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవరెడ్డి
- ఆర్.కె న్యూటెక్ గని పై హోమం, అన్నదానం
ఆర్.కె న్యూస్, నస్పూర్: ప్రకృతికి విరుద్ధంగా విధులు నిర్వహించే ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా వారి పై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవరెడ్డి అన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-న్యూటెక్ గనిలోని మైసమ్మ ఆలయంలో మంగళవారం హోమం నిర్వహించారు. ఏరియా జీఎం బి. సంజీవరెడ్డి-రాధా కుమారి దంపతులు, గ్రూప్ ఏజెంట్ మాలోత్ రాముడు-లీలావతి దంపతులు, గని ఎస్ ఓ ఎం ఇ. స్వామి రాజు-రమాదేవి దంపతులు, రక్షణాధికారి కొట్టె రమేష్-అరుణ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం బి. సంజీవరెడ్డి మాట్లాడుతూ పని స్థలాల్లో ప్రతి ఒక్కరూ రక్షణతో కూడిన విధులు నిర్వహించాలని తెలిపారు. ఉద్యోగులందరూ సమిష్టి కృషితో గనిని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని పేర్కొన్నారు. అనంతరం గని ఆవరణలో అన్నదానం ఏర్పాటు చేయగా ఉద్యోగులు, కార్మిక కుటుంబాలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు కె. వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య , ఏరియా కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, కొట్టె కిషన్ రావు,హెచ్.ఎం.ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గనిని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, ఏజెంట్లు గోపాల్ సింగ్, శ్రీధర్, అధికారులు ఏవీ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవీందర్, మురళీధర్ రావు, డాక్టర్ లోక్ నాథ్ రెడ్డి, అన్ని గనుల మేనేజర్లు, విభాగాల అధికారులు, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి ఎ.సంపత్, గజ్జి రమేష్, సందీప్ కుమార్, తిరుపతిరెడ్డి, మల్లేష్, ఆలయ కమిటీ, మైన్ కమిటీ, సేఫ్టీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- కోల్ ఇండియాతో పోటీ పడే స్థాయికి సింగరేణి
- మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సంస్థ మనుగడ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం నస్పూర్ పట్టణంలో నిర్వహించిన సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, రిటైర్డ్ కార్మికుల ఆత్మీయ సదస్సులో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జనక్ ప్రసాద్ తో కలిసి సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్టు & అవుట్ సోర్సింగ్ లేబర్ యూనియన్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, తొలి సరిగా కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి లాభాల నుంచి 5 వేల రూపాయల చెల్లించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. కార్మికులకు కాంగ్రెస్ పార్టీ, ఐఎన్టీయూసీ అండగా ఉంటాయని, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కొన్ని కార్మిక సంఘాలు సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని అంటున్నాయని, సింగరేణి అనేది ప్రభుత్వరంగ సంస్థ అని, సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలో రిటైర్డ్ కార్మికులకు క్వార్టర్లు, తెల్ల రేషన్ కార్డులు వచ్చేలా చూస్తామన్నారు. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఒరిస్సాలోని నైనీ బ్లాక్ సమస్య పరిష్కారం అయ్యిందని అన్నారు. త్వరలో సింగరేణి సంస్థ కోల్ ఇండియాతో పోటీ పడే స్థాయికి చేరుతుందన్నారు. గత ప్రభుత్వం కార్మికులను పట్టించుకోలేదని, మాజీ సీఎం కేసీర్ శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 450 మంది అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారని, డిపెండెంట్ల వయోపరిమితి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచడం వల్ల ఎన్నో కార్మిక కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. అనంతరం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర మినిమం వేజెస్ కార్పొరేషన్ చైర్మన్ బి. జనక్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు గతం కంటే మెరుగైన లాభాల వాటా చెల్లించిందని, పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. సింగరేణిలో మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని పలువురు రిటైర్డ్ కార్మికులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు . ఈ కార్యక్రమంలో నాయకులు జెట్టి శంకర్ రావు, కాంపెల్లి సమ్మయ్య, నర్సింహా రెడ్డి, ధర్మపురి, భీం రావు, గరిగ స్వామి, కలవేన శ్యామ్, సురిమిళ్ళ వేణు, బండారి సుధాకర్, తూముల నరేష్, పూదరి తిరుపతి, కాంగ్రెస్ , ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని వనిత వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 108 కలశాలతో దుర్గామాత మహా సంకల్ప శోభాయాత్ర నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, అడ్వకేట్, సైకాలజిస్ట్ రంగు వేణు కుమార్ తెలిపారు. శోభాయాత్ర విశ్వనాథ ఆలయం నుంచి ప్రారంభమై ఆర్.బి.హెచ్.వి స్కూల్ గ్రౌండ్ కు చేరుకున్న అనంతరం అమ్మవారికి అభిషేకం, లలిత సేవా సమితి వారిచే దుర్గా మాత అష్టోత్తర శతనామావళి పారాయణం, సాయంత్రం మహిళలతో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వనిత వాక్కు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ అమ్మవారి నవరాత్రుల్లో అంతర్జాతీయ బాలికల దినోత్సవం రావడం వల్ల ఆడ పిల్లల క్షేమం కోరుతూ, ఆడపిల్లలు ఆది పరాశక్తి గా మారి వారిని వారు రక్షించుకునే విధంగా దృఢంగా తయారవ్వాలని, అలాగే ప్రతి మనిషిలో పేరుకుపోతున్న చెడుని సంహారించబడాలని కోరుతూ సర్వేజనా సుఖినోభవంతు అనే సంకల్పం తో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మార్వాడి యువ మంచ్, ఆర్.బి.హెచ్.వి స్కూల్ యజమాన్యం, స్పాన్సర్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనిత వాక్కు కో ఫౌండర్స్ తాళ్లపల్లి కవిత, కుర్మా సునీత, జ్యోత్స్న చంద్రధత్, చందన, చిగురు మంజుల, తణుకు తేజస్విని తదితరులు పాల్గొన్నారు.
- నేరాల అదుపులో సిసి కెమెరాల పాత్ర కీలకం
- శ్రీరాంపూర్ ఎస్సై ఎం. సంతోష్
ఆర్.కె న్యూస్, నస్పూర్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీరాంపూర్ ఎస్సై ఎం. సంతోష్ స్పష్టం చేశారు. శనివారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయ్ నగర్ లో శ్రీరాంపూర్ పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఎస్సై ఎం. సంతోష్ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం భాగంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యత అని, అపరిచితుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు బానిసగా మారి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. అత్యవసర సమయంలో 100 నంబర్ కి కాల్ చేయాలని, సైబర్ నేరాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, నేరాల అదుపు, నేరగాళ్ల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆత్మహత్యలు, లైంగిక వేధింపులు, గంజాయి వంటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాల పై, వివిధ చట్టాల పై ప్రజలను చైతన్యం చేస్తూ, షీ టీమ్, డయల్ 100 పై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సరైన వాహన పత్రాలు, నెంబర్ ప్లేట్ సరిగా లేని 25 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 95వ జయంతి వేడుకలు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం శ్రీరాంపూర్ ఐఎన్టీయూసీ బ్రాంచ్ కార్యాలయంలో ఐఎన్టీయూసీ శ్రేణులు గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు మాట్లాడుతూ కాకా వెంకట స్వామి కార్మిక పక్షపాతి అని, కార్మిక లోకానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జాతీయ సమితి సభ్యులు సిహెచ్ భీమ్ రావు, కేంద్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ గరిగ స్వామి, కేంద్ర నాయకులు పి. రమేష్, తిరుపతి రాజు, ఏ. రవీందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ జీఎం బి సంజీవ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి కృషి చేయాలని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ బి సంజీవరెడ్డి అన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ 1, ఎస్సార్పీ 3 గనులలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో జనరల్ మేనేజర్ దంపతులు బి సంజీవ రెడ్డి, సేవాధ్యక్షురాలు రాధాకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు ఏరియాలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల పై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఏరియాలో పనిచేస్తున్న ఉద్యోగులకు, అధికారులకు, ప్రజలకు దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్పీ గ్రూప్ గనుల ఏజెంట్ దంపతులు గోపాల్ సింగ్, రష్మీ సింగ్, గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ కొమురయ్య, ఎస్సార్పీ 3 గని మేనేజర్ వెంకట్రావు గారు, ఎస్సార్పీ 1, ఎస్సార్పీ 3 గనుల రక్షణాధికారులు రాజేష్ కుమార్, ఈ మహేందర్ , పిట్ కార్యదర్శులు దాడి రాజయ్య, మురళి చౌదరి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి అమ్ముతుండగా ముగ్గురు వ్యక్తులను గురువారం అరెస్టు చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఏ. అశోక్ తెలిపారు. మంచిర్యాల రూరల్ సీఐ ఏ. అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. నమ్మదగిన సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది తీగల్పహాడ్ శివారులోని క్రషర్ మిల్ చెట్ల పొదల్లో వద్దకు వెళ్ళగా అక్కడ ఉన్న గోదారి రాజు, జాడి వంశీ, సాయి కుమార్ లను పట్టుకున్నట్లు, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 1.5 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జల్సాలు, గంజాయి తాగడానికి అలవాటు పడిన నిందితులు భద్రాచలం నుంచి గంజాయిని తక్కువ ధరకు కోనుగోలు చేసి, వారు గంజాయి త్రాగడానికి, ఎక్కువ ధరకు ఇతరులకు అమ్మడానికి కొనుగోలు చేసిన గంజాయిని ఏడుగురు నిందితులు పంచుకునే సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి, దొరికిన ముగ్గురు నిందితులను మాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్నవారిలో సిసిసి నస్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ నెల్కి సుగుణాకర్, ఏఎస్సై ఎజాస్, హెడ్ కానిస్టేబుల్ చుంచు తిరుపతి, పిసి నరేందర్ ఉన్నారు
ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ సూరిమిల్ల వేణు, మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ లు మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ శాంతి, అహింసా మార్గంలో పోరాడారని అన్నారు. అనంతరం స్వచ్ఛత హీ సేవ చివరి రోజు కార్యక్రమంలో భాగంగా నస్పూర్ మునిసిపాలిటీలో పని చేస్తున్న 5 మంది శానిటేషన్ సిబ్బందిని శాలువాలతో సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.