వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: కిడ్నీ సంబంధిత వ్యాధితో పోరాడుతున్న నిరుపేద కూలీ బిడ్డను ఆదుకునేందుకు ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ (అక్ట్) ముందుకొచ్చింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం ఆర్కే 6 కొత్త గుడిసెలకు చెందిన కూలీ జాడి సుధాకర్ నాలుగు ఏళ్ల కుమార్తె తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్లోని రెయిన్బో పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నారి చికిత్సకు సుమారు 8 నుంచి 10 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో, అంత మొత్తం భరించే స్తోమత లేక ఆ తండ్రి దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు హైదరాబాద్లోని ఆసుపత్రికి వెళ్లి పాప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత తండ్రి సుధాకర్కు ట్రస్ట్ తరఫున 10 వేల రూపాయల తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ కుటుంబానికి అండగా నిలిచేందుకు దాతలు ఉదారంగా ముందుకు రావాలని ట్రస్ట్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు డి. ప్రేమ్ కుమార్, వెంకటరామిరెడ్డి, పి. శ్రీనివాస్ పాల్గొన్నారు.





ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు భారీస్థాయిలో అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ వేడుకల్లో శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్-ఉమారాణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఆలయ కమిటీ ప్రతి ఏటా మార్కండేయ జయంతితో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను క్రమశిక్షణతో నిర్వహించడం అభినందనీయమన్నారు. కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలు భగవంతుని ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సింగరేణి యాజమాన్యం తరపున ఆలయ అభివృద్ధికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం, ఆలయ కమిటీ అధ్యక్షులు చిలగాని బొడ్డయ్య, సిరిపురం రామన్న, మహిళా అధ్యక్షురాలు చిప్ప సులోచన, మాటేటి వెంకన్న, కొండా శ్రీనివాస్, కుందారపు రమేష్, తౌటం మల్లేష్, పెరుమాండ్ల సరోజన, చిప్ప రాజబాబు, సబ్బని భాస్కర్, కటకం లక్ష్మణ్, ఆడేటి రాజన్న, కుందారపు రాములు, క్యాతం రాజేష్, ఆడేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా కొత్త క్యాడర్ స్కీమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఉద్యోగులకు సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పించే అంశాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సింగరేణి విస్తరణకు ఆరు జిల్లాల్లో అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, నూతన గనుల అన్వేషణ ద్వారానే సంస్థ పురోగతి సాధ్యమని పేర్కొన్నారు. సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్రలను కార్మికులు సమైక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్మిక సంక్షేమం, సామాజిక భద్రత కోసం బిఎంఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్, పిట్ కార్యదర్శి కొమ్మ బాపు, జాయింట్ సెక్రెటరీలు బోయిన మల్లేష్, కట్టుకూరి సతీష్, రాజారాం కిరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జల్ల తిరుపతి, బుర్ర అరుణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆయా విభాగాల అధిపతులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే వారందరికీ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేడుకల్లో భాగంగా వివిధ గనుల్లో ఎంపిక చేసిన ఉత్తమ ఉద్యోగులకు సన్మానం, మార్చ్ ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేడుకల్లో శ్రీరాంపూర్ ఏరియా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, డీజీఎంలు ఆనంద్ కుమార్, రవీందర్, ఏబీ హరి నారాయణ, క్వాలిటీ మేనేజర్ కె. వెంకటేశ్వర రెడ్డి, డీవైపీఎం ఎం. రాజేష్, సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి పాల్గొన్నారు.