KYATHAM RAJESH
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండల పరిధిలోని అభినవ కాలనీలో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఏ. అశోక్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల సీఐ అశోక్ సిసిసి నస్పూర్ ఎస్సై ఉపేందర్ రావుతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 9న సాయంత్రం కూసి తిరుపతి అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి సొంత గ్రామానికి వెళ్లి మరుసటి రోజు వచ్చి చూసే సరికి ఇంటి మెయిన్ డోర్ తాళం పగులగొట్టి ఉందని, ఇంటి లోపలికి వెళ్లి చూడగా బెడ్ రూంలో ఉన్న టేబుల్ లాకర్ ఓపెన్ చేసి ఉందని అందులో ఉన్న పావు తులం బంగారం చెవి కమ్మలు, 2 వేల రూపాయలు నగదు, దేవుడి గదిలో ఉన్న 30 తులాల వెండి వస్తువులు, ఇంటి హాల్ లో ఉండే హోమ్ థియేటర్, సౌండ్ బార్ కనిపించడం లేదని, గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్లు ఫిర్యాదు చేయగా, సీసీసీ నస్పూర్ పోలీసులు సోమవారం మూడు బృందాలుగా ఏర్పడి కలెక్టరేట్ చౌరస్తా వద్ద నిర్బంధ వాహన తనిఖీలు చేస్తుండగా మంచిర్యాల నుండి గోదావరి ఖని వైపు వేగంగా వెళుతున్న అనుమానిత కారును ఆపి అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారించగా తాము నస్పూర్లో దొంగతనం చేసినట్లు నేరం ఒప్పుకున్న రానమల్లె గజనంద్, సయ్యద్ అమాన్ లను రిమాండ్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. దొంగతనం కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ లు అభినందించారు.
- సెక్యూరిటీ సిబ్బంది సేవలు అభినందనీయం
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ విభాగం పాత్ర కీలకమని శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సెక్యూరిటీ విభాగంలో నూతనంగా నిర్మించిన వేదికను ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ ప్రారంభించారు. ఇటీవల ఇందారం ఉపరితల గని చెక్ పోస్ట్ సమీపంలో కాపర్ కేబుల్ దొంగలను పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది బి. వెంకటేష్, ఓ. తిరుపతి, శ్రీనివాస్, కొమ్మ బాపులను ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం మాట్లాడుతూ, సుమారు 80 వేల రూపాయల విలువ గల సింగరేణి ఆస్తిని సెక్యూరిటీ సిబ్బంది కాపాడడం అభినందనీయమని, సింగరేణి ఆస్తిని ఎల్లవేళలా కాపాడాలని, సెక్యూరిటీ విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరు బార్డర్ లో సైనికుల మాదిరి తమ విధులు నిర్వర్తించాలని, సింగరేణి ఆస్తుల పరిరక్షణలో ప్రతి ఒక్క సెక్యూరిటీ ఉద్యోగి పట్టుదలతో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కే. వెంకటేశ్వర్ రెడ్డి, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, సెక్యూరిటీ అధికారి జక్కా రెడ్డి, ఎస్.ఈ (ఐఈడి) కిరణ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ శంకరయ్య, ఇన్స్పెక్టర్లు రామి రెడ్డి, రాజన్న, ఇతర సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- గుర్తింపు కార్మిక సంఘం నాయకులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని కృష్ణ కాలనీ శాంతి స్టేడియంలో మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో శనివారం శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు కందికట్ల వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా మాట్లాడుతూ, కృష్ణ కాలనీలోని శాంతి స్టేడియంలో కనీస సౌకర్యాలు లేక కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, స్టేడియం చుట్టూ ప్రహరీ గోడతో పాటి సరిపడా విద్యుత్ దీపాలు లేకపోవడంతో ఆకతాయిలు మద్యం సేవించడం, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతుందని, వర్షాకాలంలో స్టేడియంలో నీరు నిలిచి వాకర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా కార్మికుల కుటుంబ సభ్యులు శాంతి స్టేడియంలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారని, సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా శాంతి స్టేడియంలో ప్రహరీ గోడను నిర్మించడంతో పాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, స్టేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, కోశాధికారి నాగభూషణం, జీఎం కమిటీ చర్చల ప్రతినిధులు ప్రసాద్ రెడ్డి, బద్రి బుచ్చయ్య, సంపత్, గొల్లపల్లి రామచందర్, కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, ఫిట్ కార్యదర్శిలు ఆకుల లక్ష్మణ్, గునిగంటి నర్సింగారావు, మోతే లచ్చన్న, నవీన్ రెడ్డి, సందీప్, సంఘం సదానందం, అగ్గు శ్రీకాంత్, పెద్దయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
- బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి ప్రత్యేక వైద్యులు
బెల్లంపల్లి, ఆర్.కె న్యూస్:సింగరేణి ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న సింగరేణి సంస్థ ఉద్యోగుల వైద్య సేవల కోసం మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు వస్తుందని బెల్లంపల్లి ఏరియా అధికార ప్రతినిధి (పర్సనల్ మేనేజర్) రెడ్డిమల్ల తిరుపతి బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో వారంలో కొన్ని రోజులు ప్రత్యేక వైద్యులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారన్నారు. అందులో భాగంగానే బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి లో ప్రతి శుక్రవారం జనరల్ మెడిసిన్, ఆర్థో సర్జన్, సైక్రియాటిస్టు, మరియు ప్రతి మంగళవారం జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, డెర్మటాలజిస్ట్ వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: సిసిసి నస్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ గా యు. ఉపేందర్ రావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. టాస్క్ ఫోర్స్ ఎస్సైగా పనిచేస్తున్న ఉపేందర్ రావు సిసిసి నస్పూర్ ఎస్సైగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు బాధ్యతాయుతంగా కృషి చేస్తానని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
- మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా నస్పూర్ – శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో నస్పూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రెనే హాస్పిటల్, మెడ్ లైఫ్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైద్య రంగ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో నస్పూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ఈ శిబిరంలో ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, కార్డియాలజీ, పల్మనాలజీ, జాయింట్ రీప్లేస్మెంట్, స్పైన్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఇన్ ఫెర్టిలిటీ, చైల్డ్ కేర్, జనరల్, లాప్రోస్కోపీ సర్జరీ, యూరాలజీ వంటి అనేక సంబంధిత వైద్య పరీక్షలు ప్రజలకు ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. మనలో ఉన్న సమస్య సాధారణంగా తెలియదని, పరీక్షలు నిర్వహించినప్పుడు బయటపడుతుందని, ఇలాంటి శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. రెనె ఆసుపత్రి చైర్మన్ బంగారి స్వామి, నస్పూర్ – శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 1200 మంది హాజరై వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. శ్రీరాంపూర్ ఎస్వోటు జీఎం సత్యనారాయణ ఈసీజీ, టూడీ ఏకో సేవలను ప్రారంభించారు. మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల ఆశోక్ శిబిరాన్ని సందర్శించి, వైద్య సేవలను పరిశీలించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా తాము చేపట్టిన ఈ సూపర్ స్పెషాలిటీ ఉచిత మెగా వైద్య శిబిరానికి సహకరించిన రెనె సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యజమాన్యానికి, మంచిర్యాల మెడిలైఫ్ ఆసుపత్రి యజమాన్యానికి, తమకు అన్ని విధాలుగా సహకారం అందించిన శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి, ఇతర సింగరేణి అధికారులు, పోలీస్ అధికారులకు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భూపతి రవి, గౌరవ అధ్యక్షుడు భాస్కరి రాజేశం, ఉపాధ్యక్షులు శ్రీపతి రాములు, ఆర్గనైజింగ్ కార్యదర్శి క్యాతం రాజేష్, సంయుక్త కార్యదర్శి ఏల్పుల మల్లేష్, కోశాధికారి కేశిరెడ్డి నారాయణరెడ్డి, కార్యవర్గ సభ్యుడు తలారి సమ్మయ్య, క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ కోడం రవికుమార్, సభ్యులు బియ్యాల రాజ్ కుమార్, దాసరి నరేందర్, కుమ్మరి సతీష్, నారమల్ల పురుషోత్తం, వైద్య శ్రీనివాస్, ఏబీ రెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెనె ఆసుపత్రి చైర్మన్ బంగారి స్వామి, క్యాంపు కోఆర్డినేటర్లు పుల్లూరి సుధాకర్, వసీమోద్దీన్, రెనె ఆసుపత్రి జీఎం బంగారి పవన్ ప్రసాద్, నాన్ సర్జికల్ డైరెక్టర్ మేకల అరవిందరావు, వైద్యులు దినకర్, నిఖిల్ లక్ష్మణ్, రవి కుమార్, జొన్నల శ్రీనివాస్, రాజ్ కిరణ్, కనకరాజు, రామలక్ష్మి, ఫర్హన, శివకుమార్, వైభవ్, మెడిలైఫ్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కుమారస్వామి, చేతన్ చౌహాన్, తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: అఖిల భారత యువజన సమాఖ్య 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నస్పూర్ మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి శ్రీరాంపూర్ కటిక దుకాణాల దగ్గర జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి మాట్లాడుతూ, 1956 మే 3న భగత్ సింగ్ ఆశయ సాధన కోసం అఖిల భారత యువజన సమాఖ్య ఆవిర్భవించిందని, ఎన్నికల హామీ మేరకు బీజేపీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ఆక్ట్ అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి మహేష్, మండల నాయకులు ఎస్.కె అక్బర్, తిరుపతి, శ్రీనివాస్, రాజేష్, సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
- మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, ఆర్. కె న్యూస్: వేసవి సెలవులలో విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తూ పాఠ్య, పాఠ్యేతర అంశాలను అందిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బాలికల వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మాథ్స్, డాన్స్, మ్యూజిక్, యోగ, మెడిటేషన్, కంప్యూటర్ కోడింగ్, పెయింటింగ్ మొదలైన అంశాలలో శిక్షణ అందించేందుకు శిబిరం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. శారీరక, మానసిక ఎదుగుదలకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని, ఈ నెల 17వ తేదీ వరకు 15 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఒక బృందం, వ్యవస్థను సమర్థవంతంగా నడిపించే వ్యక్తి నాయకుడని, విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని అన్నారు. క్రీడలు, ఇతర రంగాలలో జట్టులో ఉన్న సభ్యులందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే విజయం సాధించవచ్చని అన్నారు. ప్రతి రోజు కొత్త విషయాలను నేర్చుకోవాలని, వేసవి శిక్షణ శిబిరాలలో విద్యార్థులకు కొత్త విషయాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. మనం నేర్చుకునే అంశాలను నిశితంగా పరిశీలిస్తే విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని, ప్రజా ప్రయోజనకరంగా వినూత్న ఆవిష్కరణలు రూపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు. ఒక సమస్యను అనేక దారులలో పరిష్కరించవచ్చని, చివరగా పూర్తి స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యమని అన్నారు. క్రీడలు, సంగీతం, చిత్రలేఖనం ఇతర రంగాలలో ప్రయత్నించడమే తొలి విజయమని, ఏకాగ్రత, ఇష్టంతో నేర్చుకుంటే నైపుణ్యత సాధించవచ్చు అని అన్నారు. ఏ అంశంలోనైనా నిరంతరం ప్రయత్నిస్తుంటే ఆ రంగంలో రాణించవచ్చని, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే క్రమశిక్షణ, చిత్తశుద్ధితో ప్రయత్నించాలని తెలిపారు. జిల్లాలోని 18 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల నుండి దాదాపు 200 మంది విద్యార్థినులను తీసుకురావడానికి ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సమన్వయకర్తలు చౌదరి, సత్యనారాయణమూర్తి, నస్పూర్ మండల విద్యాధికారి దామోదర్ రావు, శిబిరం సమన్వయకర్త, నస్పూర్ ప్రత్యేక అధికారి మౌనిక సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- ఏప్రిల్ నెలలో 92 శాతం ఉత్పత్తి సాధించిన శ్రీరాంపూర్ ఏరియా
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్. కె న్యూస్: సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల రక్షణ, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. బుధవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏప్రిల్ నెల ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. ఆర్.కె గని 90 శాతం, ఆర్.కె 6 గని 102 శాతం, ఆర్.కె 7 గని 74 శాతం, ఆర్.కె న్యూ టెక్ గని 105 శాతం, ఎస్సార్పీ 1 గని 78 శాతం, ఎస్సార్పీ 3,3ఏ గని 77, ఐకే1ఏ గని 76 శాతం ఉత్పత్తితో భూగర్భ గనులు 84 శాతం ఉత్పత్తి సాధించాయని, ఎస్సార్పీ ఓసిపి 126 శాతం, ఐకే ఓసిపి 28 శాతం ఉత్పత్తితో శ్రీరాంపూర్ ఏరియాలో 92 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామని తెలిపారు. ఐకే ఓసిపిలో ఓబీ కాంట్రాక్టు కార్మికుల సమ్మె కారణంగా ఉత్పత్తికి ఆటంకం కలిగిందని, ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకుల సమిష్టి కృషితో మే నెల నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. ఏప్రిల్ నెలలో 19 డిపెండెంట్లకు కారుణ్య నియామక పత్రాలు అందజేశామని, నీటి బిందువు – జల సింధువు కార్యక్రమంలో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలో 5 నూతన నీటి కుంటల నిర్మాణంతో 2 పాత చెరువులను పునరుద్ధరణ చేయనున్నట్లు, ప్రాణహిత స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని, సింగరేణి అధ్వర్యంలో పాలిసెట్, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు, వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, ఎస్ఈ (ఐఈడి) కిరణ్ కుమార్, సీనియర్ పిఓ పి. కాంత రావు తదితరులు పాల్గొన్నారు.