మహిళా హక్కుల పోరాటంలో గుర్తింపు.. బీసీ ఉపకోటాకై ఉద్యమించాలని పిలుపు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్లో మంగళవారం హైకోర్టు న్యాయవాది పేరం అలేఖ్యను జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఇటీవల హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అలేఖ్య ‘మహిళా లెజెండరీ జాతీయ అవార్డు’ అందుకున్నారు. మహిళల హక్కులు, చట్టసభల్లో రిజర్వేషన్ల సాధన కోసం ఆమె చేస్తున్న పోరాటాన్ని గుర్తించి ఈ పురస్కారం ప్రదానం చేశారు. జిల్లాకు చెందిన మహిళకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం గర్వకారణమని సమితి నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు. అలేఖ్య అనేక సంవత్సరాలుగా మహిళా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు కోసం ఆమె చురుగ్గా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ప్రత్యేకంగా ఉపకోటా కల్పించాలని సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ లక్ష్య సాధన కోసం జరిగే ఉద్యమాల్లో మహిళలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నేటి తరం మహిళలు అలేఖ్యను స్ఫూర్తిగా తీసుకుని విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, వేముల అశోక్, రాజన్న చారి, మంచిర్ల సదానందం, కొట్టే నటేశ్వర్ తో పాటు పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.




ప్రదర్శించారు. పక్షుల కోసం ఏర్పాటు చేసిన మట్టి పాత్రలు, ఆహారమైన జొన్న గొలుసులు, ధాన్యాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పిచ్చుకల సంరక్షణకు సంబంధించి ప్లకార్డులతో నినాదాలు చేశారు. కార్యక్రమానికి హాజరైన మంచిర్యాల నగర పాలక సంస్థ 11వ డివిజన్ కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ మాట్లాడుతూ పిచ్చుకలు ఉన్న చోట పరిసరాలు శుభ్రంగా ఉంటాయని తెలిపారు. పిచ్చుకలు హానికారక క్రిమి కీటకాలను తింటూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయన్నారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ మాట్లాడుతూ పిచ్చుకల రక్షణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. వేసవిలో వాటికి తాగునీరు, ఆహారం అందించాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణను శాలువాతో సన్మానించి పచ్చని మొక్కను బహూకరించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ జిల్లా కార్యాలయ ఏఓ పొన్న మల్లయ్య, న్యాయవాదులు అలేఖ్య, నటేశ్వర్ పాల్గొన్నారు. పశు వైద్యాధికారి డాక్టర్ గుల్లపల్లి శంకర్ లింగం, మండల వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్ హాజరయ్యారు. జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి కిష్టయ్య, సినీ గేయ రచయిత అక్కల చంద్రమౌళి, సంస్థ సభ్యులు మహేందర్, వంశీ, స్వర్ణ, శోభ, సునీత, రాధ, శరత్ చంద్ర, రాజశేఖర్, కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వల్లనో గానీ నెల రోజుల ముందే ఇవి పూయడం విశేషం. ఏకధాటిగా నాలుగు పూలు పూయడంతో స్థానికులు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. పుట్బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ అనే అరుదైన జాతికి చెందిన ఈ పువ్వును భారతదేశంలో మే పుష్పం అని పిలుస్తారు. ఎరుపు వర్ణంలో, గుబురుగా బంతి ఆకారంలో ఉండే ఈ పుష్పాలు ఏప్రిల్, మే నెలల్లో వికసిస్తాయి. దుంప రకానికి చెందిన ఈ మొక్కలు భూమిలో విస్తరిస్తూ ఒక్కో దుంపకు ఏడాదికి ఒక పువ్వును మాత్రమే పూస్తాయి. సుమారు రెండేళ్ల క్రితం ఒక నర్సరీ నుంచి తెచ్చిన దుంపలను రాజ్ కుమార్ తన ఇంటి వద్ద నాటారు. మొదటి ఏడాది ఒక పువ్వు మాత్రమే పూయగా, ఈసారి మొక్కలు విస్తరించి నాలుగు పూలు వికసించాయి. ఇసుక నేలల్లో బాగా పెరిగే ఈ మొక్కలు మొగ్గ తొడిగిన నాటి నుంచి వికసించడానికి దాదాపు 20 రోజులు పడుతుంది. ఇవి రోజులో సుమారు నాలుగు గంటల పాటు పూర్తిగా వికసించి ఉంటాయి. పర్యావరణాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని ప్రకృతి ప్రేమికుడు రాజ్ కుమార్ కోరారు. పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ ను ఆదర్శంగా తీసుకుని గత కొన్నేళ్లుగా పర్యావరణ హిత కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. చెట్లను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ముందే వికసించిన ఈ మే పుష్పాలను చూసి ఆనందిస్తున్న పర్యావరణ ప్రేమికులు, స్థానికులు వాటి వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.