- మదర్స్ ప్రైడ్ స్కూల్ లో వైభవంగా పోశమ్మ బోనాల ఉత్సవాలు
- శోభాయాత్రగా తరలివెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించిన విద్యార్థులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని మదర్స్ ప్రైడ్ స్కూల్ ప్రిన్సిపాల్ దండ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నస్పూర్ పట్టణంలోని మదర్స్ ప్రైడ్ పాఠశాలలో బుధవారం పోశమ్మ బోనాల పండుగను
ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బోనం పోసి, పోతురాజులు, అమ్మవార్ల వేషధారణలతో అలరించారు. అనంతరం విద్యార్థులు మంగళ వాయిద్యాల నడుమ బోనాలు నెత్తినెత్తుకుని ఊరేగింపుగా పోశమ్మ దేవాలయానికి తరలివెళ్లి గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ దండ రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ రేగళ్ల ఉపేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బోనాల పండుగ విశిష్టతను, గ్రామ దేవతల ప్రాముఖ్యతను, బోనం సమర్పించే సంప్రదాయాన్ని వివరించారు. పూజా కార్యక్రమాల అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వదీప్తి, సంధ్య, రజిత, సరిత, సుమలత, శ్రీవాణి, రాజేశ్వరి, పద్మ, స్రవంతి, షానాజ్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.







