సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండల కేంద్రంలో రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన మహిళా మత్స్యకారుల భవనాన్ని (మహిళల జీవనోపాధి – ఆర్థిక సాధికారత కేంద్రం) ను శుక్రవారం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ
సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకార మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మహిళలకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, మత్స్యకారుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ భవన నిర్మాణం ద్వారా మహిళా మత్స్యకారులకు శిక్షణ, సమావేశాలు మత్స్య ఉత్పత్తుల నిల్వకు అనుకూలంగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, సర్పంచ్ అంపోలి వనజా కృష్ణ ప్రసాద్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మత్స్యకార సంఘం నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
12







