నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆగస్టు 15న జరుపుకోనున్న జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నస్పూర్ మండలంలో ముందస్తు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సింగపూర్ మాజీ సర్పంచ్ మల్లెత్తుల రాజేంద్రపాణి, మాజీ ఎంపీటీసీ లాట్కూరి రాజలింగు ఆధ్వర్యంలో ఆర్.కే-6 అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు గొడుగుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి హాజరై చిన్నారులకు గొడుగులను అందజేశారు. ప్రజాసేవలో ముందుండే నాయకుల జన్మదినాన్ని ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు ఉపయోగపడేలా గొడుగులు అందించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, ట్రస్మా ఉపాధ్యక్షుడు రేగేడ్ల ఉపేందర్, భవాని శ్రీను, నాయకులు సందినేని సతీష్ యాదవ్, పూదరి కుమార్, గోపతి తిరుపతి, రాజేశ్వర్ రెడ్డి, నరేష్, రమేష్, దాసరి మధు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
9







