- మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరుతుందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్లో లబ్ధిదారులు శీలం గట్టక్క, గట్టయ్య దంపతులు పూర్తి చేసుకున్న నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఇంటిని ప్రారంభించి, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాచకొండ గోపాల్ రావు, హౌసింగ్ బోర్డు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.







