డిసిఓఆర్ ప్రశాంతి
సోన్, ఆర్.కె న్యూస్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2026- 27 విద్యా సంవత్సరానికి గాను నడపబడుతున్న నీట్ లాంగ్ టర్మ్ శిక్షణ కొరకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్మల్ జిల్లా సమన్వయకర్త ఆర్. ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని చిలుకూరు సీఓఈ నందు బాలురకు, మహేంద్ర హిల్స్ ఫౌండేషన్ సీఓఈ నందు బాలికలకు ఉచిత శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. దరఖాస్తు చేసుకొనుటకు అభ్యర్థులు ఏదైనా కళాశాలలో 2025-26లో ఇంటర్మీడియట్ బైపీసీ చదివి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు tgwreis.telangana.gov.in అనే వెబ్సైట్ సందర్శిస్తే నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు ఫారం పొందవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 22 అని, దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదని ప్రకటనలో పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని డీసీవో కార్యాలయం TGSWRS JC (బాలికల) లెఫ్ట్ పోచంపాడ్ లో నిర్దిష్ట గడువులోపు దరఖాస్తు ఫారాలను సమర్పించాలని సూచించారు.







