ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నోడల్ అధికారి అంబటి శ్రీనివాస్ గౌడ్
ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణ తరగతుల పరిశీలన
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: గ్రామ పరిపాలనలో నూతన సర్పంచులు పట్టు సాధించాలని, పంచాయతీ రాజ్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నోడల్ అధికారి అంబటి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ముల్కల్లలోని ఐజా ఇంజినీరింగ్ కళాశాల వేదికగా జిల్లా స్థాయి నూతన సర్పంచులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ కోసం ఏర్పాటు చేసిన తరగతి గదులు, పురుషులు, మహిళలకు వేర్వేరుగా కల్పించిన వసతి సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులను అభినందించారు.
శిక్షణలో ఉన్న సర్పంచులను ఉద్దేశించి అంబటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పారదర్శకమైన పాలన అందించేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. సుశిక్షితులైన మాస్టర్ ట్రైనర్ల ద్వారా చట్టపరమైన అంశాలను, నిధులను వెచ్చించే విధానాలను అడిగి తెలుసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. శిక్షణకు హాజరయ్యే వారు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, ప్రతి అంశాన్ని శ్రద్ధగా నేర్చుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మోహన్, సాయి వెంకట్ రెడ్డి, మండల పంచాయతీ అధికారులు శ్రీపతి బాపు రావు, వేదాల శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు మాస్టర్ ట్రైనర్లు అనిల్ కుమార్, వెంకటేష్, మహేష్, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లా ట్రైనింగ్ మేనేజర్ శారద, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ నరేందర్, జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది హాజరయ్యారు.





ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు భారీస్థాయిలో అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ వేడుకల్లో శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్-ఉమారాణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఆలయ కమిటీ ప్రతి ఏటా మార్కండేయ జయంతితో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను క్రమశిక్షణతో నిర్వహించడం అభినందనీయమన్నారు. కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలు భగవంతుని ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సింగరేణి యాజమాన్యం తరపున ఆలయ అభివృద్ధికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం, ఆలయ కమిటీ అధ్యక్షులు చిలగాని బొడ్డయ్య, సిరిపురం రామన్న, మహిళా అధ్యక్షురాలు చిప్ప సులోచన, మాటేటి వెంకన్న, కొండా శ్రీనివాస్, కుందారపు రమేష్, తౌటం మల్లేష్, పెరుమాండ్ల సరోజన, చిప్ప రాజబాబు, సబ్బని భాస్కర్, కటకం లక్ష్మణ్, ఆడేటి రాజన్న, కుందారపు రాములు, క్యాతం రాజేష్, ఆడేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా కొత్త క్యాడర్ స్కీమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఉద్యోగులకు సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పించే అంశాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సింగరేణి విస్తరణకు ఆరు జిల్లాల్లో అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, నూతన గనుల అన్వేషణ ద్వారానే సంస్థ పురోగతి సాధ్యమని పేర్కొన్నారు. సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్రలను కార్మికులు సమైక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్మిక సంక్షేమం, సామాజిక భద్రత కోసం బిఎంఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్, పిట్ కార్యదర్శి కొమ్మ బాపు, జాయింట్ సెక్రెటరీలు బోయిన మల్లేష్, కట్టుకూరి సతీష్, రాజారాం కిరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జల్ల తిరుపతి, బుర్ర అరుణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.