శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
22 రోజుల ముందే లక్ష్యాన్ని చేరిన ఎస్సార్పీ 1 గని
సింగరేణిలో శ్రీరాంపూర్ ఏరియా భూగర్భ గనుల జోరు
నస్పూర్, ఆర్.కె న్యూస్: నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి ద్వారానే మార్కెట్లో నిలదొక్కుకోగలమని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం ఎస్సార్పీ 1 గనిపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగింపునకు 22 రోజుల ముందే వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించిన అధికారులు, కార్మికులను అభినందించారు. రక్షణతో కూడిన ముందస్తు ఉత్పత్తి కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా ప్రశంసించారు. సింగరేణి వ్యాప్తంగా శ్రీరాంపూర్ ఏరియా భూగర్భ గనులు సత్తా చాటుతున్నాయని ఆయన వివరించారు. ఆర్.కె న్యూటెక్ గని బాటలోనే ఎస్సార్పీ 1 సైతం నిర్ణీత గడువు కంటే ముందే లక్ష్యాన్ని చేరుకోవడం సంతోషదాయకమని మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 19 నాటికే 40 రోజుల ముందుగా లక్ష్యాన్ని సాధించి ఆర్.కె న్యూటెక్ గని సింగరేణిలోని అన్ని గనుల్లో మొదటి వరుసలో నిలిచిందని గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో గని జీవితకాలం పెంపునకు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిపై కార్మికులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. ఉత్పత్తి లక్ష్య సాధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మునిగంటి శ్రీనివాస్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచి కార్యదర్శి మోతుకూరి కొమురయ్య, ఎస్సార్పీ గ్రూప్ ఏజెంట్ రవికుమార్, గని మేనేజర్ ఆత్మారాం సహాని, రక్షణ అధికారి గోవిందచంద్ర ముర్ము, సంక్షేమ అధికారి అరుణ్ తేజ, పిట్ కార్యదర్శి దాడి రాజయ్య, సూపర్ వైజర్లు, మైనింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




తీసుకుంటున్నట్లు వివరించారు. మహిళలకు సరైన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తారని ఉమారాణి పేర్కొన్నారు. నేడు మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ కొన్ని విభాగాలను శాసిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. వారిని నిరంతరం ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ పై జరిపిన ఆపరేషన్ సింధూర్ కు మహిళలు నాయకత్వం వహించడం భారతీయులందరికీ గర్వకారణమని ఉమారాణి గుర్తు చేశారు. అంతకుముందు అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ మహిళా ఉద్యోగులుగా ఎంపికైన ఏజీఎం ఫైనాన్స్ సుమలత, వర్క్ షాప్ జనరల్ అసిస్టెంట్ పద్మను ఘనంగా సత్కరించారు. వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణా కోర్సులు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. చిన్నారులు, సేవా సభ్యులు, సింగరేణి కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచి కార్యదర్శి బాజీ సైదా, అధికారుల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, డీజీఎం అనిల్ కుమార్, సీనియర్ పీఓ సురేందర్, సేవా సెక్రటరీ కొట్టె జ్యోతి, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
కార్పొరేషన్ పరిధిలో సింగరేణి విస్తరించి ఉన్న డివిజన్లలోని పలు ప్రజా సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. పారిశుధ్యం, నీటి సరఫరా మెరుగుపరచాలని, విద్యుత్ దీపాలు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా రెండో డివిజన్ ప్రాంతంలో నెలకొన్న డంప్ యార్డ్ సమస్యను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. నగర అభివృద్ధిలో సింగరేణి భాగస్వామ్యం కీలకమని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, కార్పొరేటర్లు బండారి సుధాకర్, వేల్పుల రవీందర్, అగ్గు సాగర్, పత్తి పకృతి, బొడ్డు స్వప్న, నాయకులు తోట శ్రీనివాస్, మర్రి రాజమొగిలి, పత్తి వెంకటేష్, బొడ్డు తిరుపతి, మున్సిపల్ సిబ్బంది, జీఎం కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఎండల తీవ్రత దృష్ట్యా మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు. డంప్ యార్డ్ వద్ద ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. విపత్తు సమయంలో సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంలో సహకరించిన ఫైర్ సిబ్బందిని అభినందించారు. డంప్ యార్డ్ చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన మేయర్ ధర్ని మధుకర్ ను స్థానిక ప్రజలు ప్రశంసించారు. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు సిబ్బందితో కలిసి మేయర్ తీసుకున్న చర్యలు స్థానికులకు ఊరటనిచ్చాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుట్ట యశోద, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
