- మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
- ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాలను రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 37, 55, 14 డివిజన్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత పేరిట నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రతి డివిజన్ లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పారిశుద్ధ్య పనులను నిశితంగా పరిశీలించిన ఆయన మున్సిపల్ సిబ్బందితో చర్చించారు. వార్డుల్లోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సిబ్బందికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. పట్టణ అభివృద్ధిలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




చేశారు. మంచిర్యాల పట్టణంతో సమానంగా నస్పూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు ప్రేమ్ సాగర్ రావు వివరించారు. ఈ ఉద్దేశంతోనే నస్పూర్ ప్రాంతానికి మేయర్ అవకాశం కల్పించినట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజలందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలతో పాటు మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేగా తన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తానని ప్రకటించారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ సంఖ్యలో గెలిపించి మంచిర్యాల కాంగ్రెస్ అడ్డా అని నిరూపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నగరపాలక సంస్థ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ నవీన్ సూచించారు. పిల్లలకు చిన్నపాటి వస్తువులు, నాణేలు, ప్రమాదకరమైన ఆటవస్తువులను ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఏదైనా వస్తువు మింగినట్లు అనుమానం వస్తే ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
భాగంగా సీసీసీ గెస్ట్ హౌస్లో లేబర్ కమిషన్ బృందానికి ఎస్సార్పీ ఓసీపీ సంక్షేమ అధికారి ఓంకార్ బాబు, శ్రీరాంపూర్ ఏరియా డీజీఎం అనిల్ కుమార్ పూర్తి వివరాలను అందజేశారు. ఉద్యోగుల వివరాల నమోదు, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ పట్ల బిస్వ భూషణ్ పృష్టి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ను బిస్వ భూషణ్ పృష్టి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీఎం మునిగంటి శ్రీనివాస్ కమిషనర్ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐకే1ఏ, ఓసీ గ్రూప్ ఏజెంట్ ఏవీ రెడ్డి, ఏజీఎం ఫైనాన్స్ సుమలత, డీజీఎం అనిల్ కుమార్ పాల్గొన్నారు.
తీసుకుంటున్నట్లు వివరించారు. మహిళలకు సరైన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తారని ఉమారాణి పేర్కొన్నారు. నేడు మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ కొన్ని విభాగాలను శాసిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. వారిని నిరంతరం ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ పై జరిపిన ఆపరేషన్ సింధూర్ కు మహిళలు నాయకత్వం వహించడం భారతీయులందరికీ గర్వకారణమని ఉమారాణి గుర్తు చేశారు. అంతకుముందు అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ మహిళా ఉద్యోగులుగా ఎంపికైన ఏజీఎం ఫైనాన్స్ సుమలత, వర్క్ షాప్ జనరల్ అసిస్టెంట్ పద్మను ఘనంగా సత్కరించారు. వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణా కోర్సులు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. చిన్నారులు, సేవా సభ్యులు, సింగరేణి కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచి కార్యదర్శి బాజీ సైదా, అధికారుల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, డీజీఎం అనిల్ కుమార్, సీనియర్ పీఓ సురేందర్, సేవా సెక్రటరీ కొట్టె జ్యోతి, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
కార్పొరేషన్ పరిధిలో సింగరేణి విస్తరించి ఉన్న డివిజన్లలోని పలు ప్రజా సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. పారిశుధ్యం, నీటి సరఫరా మెరుగుపరచాలని, విద్యుత్ దీపాలు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా రెండో డివిజన్ ప్రాంతంలో నెలకొన్న డంప్ యార్డ్ సమస్యను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. నగర అభివృద్ధిలో సింగరేణి భాగస్వామ్యం కీలకమని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, కార్పొరేటర్లు బండారి సుధాకర్, వేల్పుల రవీందర్, అగ్గు సాగర్, పత్తి పకృతి, బొడ్డు స్వప్న, నాయకులు తోట శ్రీనివాస్, మర్రి రాజమొగిలి, పత్తి వెంకటేష్, బొడ్డు తిరుపతి, మున్సిపల్ సిబ్బంది, జీఎం కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.