- మాజీ డీసీసీ అధ్యక్షురాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన కొక్కిరాల సురేఖ
- ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్ష
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్లో శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తి, సంప్రదాయం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ జాతరలో శివ సత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ ఆదిపరాశక్తి అమ్మవారి దివ్య ఆశీస్సులు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖశాంతులతో, సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, నస్పూర్ పట్టణ ఇంఛార్జి నూకల రమేష్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.








