- సిఈఆర్ క్లబ్లో అంబేద్కర్ జీవితాధారిత నాటిక ప్రదర్శన
- ఆదివారం సత్యశోధన నాటకాన్ని వీక్షించాలని నిర్వాహకుల పిలుపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితంపై ప్రదర్శించిన సంఘం శరణం గచ్ఛామి నాటకం ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నస్పూర్ సీఈఆర్ క్లబ్ ప్రాంగణంలోని గోదావరి ఫంక్షన్ హాల్లో ఈ నాటికను ప్రదర్శించారు. సింగరేణి యాజమాన్యం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు. ఈ నాటకాన్ని వీక్షించేందుకు సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంబేద్కర్ జీవిత విశేషాలను నేటి తరానికి కళ్లకు కట్టేలా ఎంతో ఆసక్తిగా ఈ నాటికలో ప్రదర్శించారని వీక్షకులు అభిప్రాయపడ్డారు. కాగా, ఆదివారం సాయంత్రం ఇదే ప్రాంగణంలో మహాత్మా జ్యోతిబా పూలే జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న సత్యశోధన నాటకాన్ని ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నాటక ప్రదర్శనకు సైతం ప్రజలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ప్రతినిధులు బాజీ సైదా, ముస్కే సమ్మయ్య, మోతుకూరి కొమురయ్య, ఎస్ ఓ టూ జీఎం కృష్ణ ప్రసాద్, ఏజీఎం సుమలత, డీజీఎంలు అనిల్ కుమార్, ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, స్థానికులు, చిన్నారులు హాజరయ్యారు.




సాగర్ రావు తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని నార్త్ ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయాల పునర్నిర్మాణ నమూనా వీడియోలను ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. రూ. 98 కోట్లతో గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్ల నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి శ్రావణమాసంలోగా పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. వచ్చే పుష్కరాల నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. రెండవ అన్నవరంగా పేరుగాంచిన గూడెం ఆలయాన్ని ఆగమశాస్త్ర ప్రకారం అభివృద్ధి చేయడంతో పాటు ఒకేసారి వెయ్యి జంటలు వ్రతాలు చేసుకునేలా మండపాలను, భక్తులకు వసతులు, బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అలాగే విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.