సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండలంలోని న్యూ వెల్మల్ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కుందారం పోశెట్టి ఇటీవల అనారోగ్యంతో మరణించగా, శనివారం ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట బన్సపల్లిపిఎసిఎస్ చైర్మన్ రమణారెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ డైరెక్టర్ తోట సాయన్న, సిద్దులకుంట సర్పంచ్ సతీష్ రెడ్డి, కేశెట్టి మల్లయ్య, కుస్తాపురం రాజలింగు, మూడపల్లి చిన్నయ్య, నర్సింగరావు, కేశెట్టి ఆశన్న, పోతుగంటి రాజేందర్, అలాగే బొప్పారం, పాకపట్ల గ్రామాల మాజీ సర్పంచులు వెంకయిగారి శ్రీనివాస్ రెడ్డి, ఏల్చల గంగారెడ్డి తదితరులు ఉన్నారు.
18







