వినాయక చవితి ఉత్సవాల్లో డీజే వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్ తెలిపారు. కోటపల్లి మండల కేంద్రంలోని డీజే నిర్వాహకులకు పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. పోలీస్ శాఖ నిబంధనల మేరకు వినాయక చవితి ఉత్సవాల్లో డీజేను అనుమతి లేదన్నారు. ఎక్కడైనా డీజే నిర్వహించినట్లు తమ దృష్టికి వస్తే డీజే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందస్తు చర్యలలో భాగంగా వారిని తాసిల్దార్ ఎదుట బైండోవర్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎస్సై సురేష్ పాల్గొన్నారు.
252