దరఖాస్తులను పరిశీలించి స్పష్టమైన జాబితా రూపొందించాలి

2వ ఓటరు జాబితా సంక్లిప్త పునరీక్షణ కార్యక్రమం-2023లో భాగంగా నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో సవరణలు, తొలగింపుల కొరకు అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసి స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లాలోని మంచిర్యాల రాజస్వ మండల అధికారి కార్యాలయం, మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేసి మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో ఫారం-6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ 2వ ఓటరు జాబితా సంక్లిప్త పునరీక్షణ కార్యక్రమం లో భాగంగా నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, సవరణలు, తొలగింపుల కొరకు ఈ నెల 19వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి ఈనెల 28వ తేదీన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందని, అక్టోబర్ 1వ తేదీన తుది జాబితా ప్రచురణ కొరకు ఎన్నికల సంఘం అనుమతి పొంది 4వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. స్పష్టమైన జాబితా రూపకల్పనలో బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ద్వారా నియమించబడిన ఏజెంట్ల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మండల తహసీల్దార్ భోజన్న, రాజస్వ మండల అధికారి కార్యాలయం డి ఏ ఓ జోస్న సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

దరఖాస్తులను పరిశీలించి స్పష్టమైన జాబితా రూపొందించాలి

2వ ఓటరు జాబితా సంక్లిప్త పునరీక్షణ కార్యక్రమం-2023లో భాగంగా నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో సవరణలు, తొలగింపుల కొరకు అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసి స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లాలోని మంచిర్యాల రాజస్వ మండల అధికారి కార్యాలయం, మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేసి మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో ఫారం-6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ 2వ ఓటరు జాబితా సంక్లిప్త పునరీక్షణ కార్యక్రమం లో భాగంగా నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, సవరణలు, తొలగింపుల కొరకు ఈ నెల 19వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి ఈనెల 28వ తేదీన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందని, అక్టోబర్ 1వ తేదీన తుది జాబితా ప్రచురణ కొరకు ఎన్నికల సంఘం అనుమతి పొంది 4వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. స్పష్టమైన జాబితా రూపకల్పనలో బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ద్వారా నియమించబడిన ఏజెంట్ల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మండల తహసీల్దార్ భోజన్న, రాజస్వ మండల అధికారి కార్యాలయం డి ఏ ఓ జోస్న సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment