సింగరేణికి రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలి

  •  సీఎంపిఎఫ్ చిట్టీలు పంపిణీ చేయాలి
  •  ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య

ఆర్.కె న్యూస్, నస్పూర్: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన 27 వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 5 గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో మాట్లాడుతూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి సొమ్మును దుర్వినియోగం చేస్తుందని,  సింగరేణి యాజమాన్యం సంస్థ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలకు మళ్లించకుండా కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలన్నారు.  సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులందరికీ రెండు గుంటల భూమి, 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఇప్పించాలన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్ల సింగరేణి సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, నూతన బొగ్గు గనులు  ఏర్పాటు చేయాలన్నారు. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అని చెప్పే సింగరేణి యాజమాన్యం పెరిక్స్ పై ఆదాయపు పన్ను అధికారులకు యాజమాన్యమే చెల్లిస్తుందని, కార్మికులకు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. యాజమాన్యం అధికారులకు చెల్లిస్తున్న మాదిరిగా కార్మికులకు కూడా ఆదాయ పన్నును చెల్లించాలని  డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాలుగా సీఎంపిఎఫ్ చిట్టీలు కార్మికులకు పంపిణీ చేయడం లేదని,  సీఎంపిఎఫ్ కమిషనర్ ను కలిసి కార్మికులకు సీఎంపిఎఫ్ చిట్టిలను వెంటనే అందించాలని కోరగా ఆగస్టు నెలలో సీఎంపిఎఫ్ చిట్టీలు ప్రతి కార్మికునికి అందేలా చూస్తామన్నారని తెలిపారు. ఈ సంవత్సరం సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలను వెంటనే ప్రకటించి లాభాల్లో 35 శాతం వాటా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా, ఏరియా కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, ఫిట్ కార్యదర్శిలు గునిగంటి నరసింగారావు, రామచందర్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, ట్రేడ్ మెన్ నాయకులు సురేష్, యాదగిరి సత్యనారాయణ రెడ్డి, సహాయ కార్యదర్శి లక్కిరెడ్డి సత్తిరెడ్డి, జిపి రావు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

సింగరేణికి రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలి

  •  సీఎంపిఎఫ్ చిట్టీలు పంపిణీ చేయాలి
  •  ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య

ఆర్.కె న్యూస్, నస్పూర్: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన 27 వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 5 గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో మాట్లాడుతూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి సొమ్మును దుర్వినియోగం చేస్తుందని,  సింగరేణి యాజమాన్యం సంస్థ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలకు మళ్లించకుండా కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలన్నారు.  సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులందరికీ రెండు గుంటల భూమి, 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఇప్పించాలన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్ల సింగరేణి సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, నూతన బొగ్గు గనులు  ఏర్పాటు చేయాలన్నారు. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అని చెప్పే సింగరేణి యాజమాన్యం పెరిక్స్ పై ఆదాయపు పన్ను అధికారులకు యాజమాన్యమే చెల్లిస్తుందని, కార్మికులకు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. యాజమాన్యం అధికారులకు చెల్లిస్తున్న మాదిరిగా కార్మికులకు కూడా ఆదాయ పన్నును చెల్లించాలని  డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాలుగా సీఎంపిఎఫ్ చిట్టీలు కార్మికులకు పంపిణీ చేయడం లేదని,  సీఎంపిఎఫ్ కమిషనర్ ను కలిసి కార్మికులకు సీఎంపిఎఫ్ చిట్టిలను వెంటనే అందించాలని కోరగా ఆగస్టు నెలలో సీఎంపిఎఫ్ చిట్టీలు ప్రతి కార్మికునికి అందేలా చూస్తామన్నారని తెలిపారు. ఈ సంవత్సరం సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలను వెంటనే ప్రకటించి లాభాల్లో 35 శాతం వాటా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా, ఏరియా కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, ఫిట్ కార్యదర్శిలు గునిగంటి నరసింగారావు, రామచందర్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, ట్రేడ్ మెన్ నాయకులు సురేష్, యాదగిరి సత్యనారాయణ రెడ్డి, సహాయ కార్యదర్శి లక్కిరెడ్డి సత్తిరెడ్డి, జిపి రావు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment