- సెక్యూరిటీ సిబ్బంది సేవలు అభినందనీయం
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ విభాగం పాత్ర కీలకమని శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సెక్యూరిటీ విభాగంలో నూతనంగా నిర్మించిన వేదికను ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ ప్రారంభించారు. ఇటీవల ఇందారం ఉపరితల గని చెక్ పోస్ట్ సమీపంలో కాపర్ కేబుల్ దొంగలను పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది బి. వెంకటేష్, ఓ. తిరుపతి, శ్రీనివాస్, కొమ్మ బాపులను ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం మాట్లాడుతూ, సుమారు 80 వేల రూపాయల విలువ గల సింగరేణి ఆస్తిని సెక్యూరిటీ సిబ్బంది కాపాడడం అభినందనీయమని, సింగరేణి ఆస్తిని ఎల్లవేళలా కాపాడాలని, సెక్యూరిటీ విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరు బార్డర్ లో సైనికుల మాదిరి తమ విధులు నిర్వర్తించాలని, సింగరేణి ఆస్తుల పరిరక్షణలో ప్రతి ఒక్క సెక్యూరిటీ ఉద్యోగి పట్టుదలతో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కే. వెంకటేశ్వర్ రెడ్డి, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, సెక్యూరిటీ అధికారి జక్కా రెడ్డి, ఎస్.ఈ (ఐఈడి) కిరణ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ శంకరయ్య, ఇన్స్పెక్టర్లు రామి రెడ్డి, రాజన్న, ఇతర సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.