నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన ఏఎస్సై నరేష్
వేమనపల్లి, ఆర్.కె న్యూస్:మండలంలోని నీల్వాయి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై నరేష్ తన ఉదారతను చాటుకున్నారు. తన తండ్రి అంబాదాస్ స్మారకార్థం రాజారం గ్రామపంచాయతీ పరిధిలోని నిరుపేదలకు ఆయన శనివారం దుప్పట్లను పంపిణీ చేశారు. ప్రస్తుతం చలికాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, ఆర్థిక స్థోమత లేని పేద ప్రజలు చలితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నరేష్ తెలిపారు. తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజారం సర్పంచ్ ఎనుగంటి మల్లేశ్వరి శేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పోశం, ఇతర పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.







