జిల్లా నేతల సమక్షంలో నిర్వహణ.. విజయవంతం చేయాలని పిలుపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండల పద్మశాలి సంఘం, శ్రీ లక్ష్మి గణపతి శివ మార్కండేయ దుర్గ మాత దేవాలయ నూతన కమిటీల ఎన్నిక ఈ నెల 4వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఎన్నికల బాధ్యులు కుందారపు రమేష్, చిలువేరు శరవందం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు గాదాసు బాపు, గౌరవ అధ్యక్షులు గడ్డం సుధాకర్, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు రాం సత్తయ్య, మందమర్రి పట్టణ అధ్యక్షులు చిలగాని సుదర్శన్ ముఖ్య అతిథులుగా హాజరై, ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధి, సంఘం పురోగతిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.







