🟣 రెండో డివిజన్లో నడిపెల్లి విజిత్ రావు ఇంటింటి ప్రచారం
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ రెండో డివిజన్ బిఆర్ఎస్ అభ్యర్థి సముద్రాల తిరుపతమ్మ గెలుపు కోరుతూ రాష్ట్ర యువజన నాయకుడు నడిపెల్లి విజిత్ రావు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. డివిజన్ వ్యాప్తంగా పర్యటించిన ఆయన ప్రతి ఇంటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో అభ్యర్థి సముద్రాల తిరుపతమ్మ, నస్పూర్ పట్టణ అధ్యక్షుడు సుబ్బయ్య, పట్టణ కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, మాజీ కౌన్సిలర్ వంగ తిరుపతి, టిబిజికెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏరియా వైస్ ప్రెసిడెంట్ పెండ్రి అన్వేష్ రెడ్డి, బస్సా రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, సీనియర్ నాయకుడు బొజ్జ శరత్ రావు, డివిజన్ నాయకులు తోట దుర్గాప్రసాద్, మండల క్రాంతి, సముద్రాల అన్వేష్, యువజన నాయకులు కాటంరాజు, దగ్గుల మధు సహా పెద్ద సంఖ్యలో వార్డు మహిళలు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.








