వేమనపల్లి, ఆర్.కె న్యూస్: మండలంలోని ముల్కలపేట గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం గ్రామ సర్పంచ్ ఒడిల కళ్యాణి సుధాకర్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మెయిన్ రోడ్డుపై కొంతకాలంగా నాలీలు మట్టితో నిండిపోగా పారిశుధ్య కార్మికుల సాయంతో నాలీల మట్టిని చెత్తను తొలగించారు. అలాగే గత కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న రెండు బోర్లకు మిషన్ ప్రెషర్ తో క్లీన్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోర్కుటి నరేష్, వార్డు సభ్యులు పాలే శైలజ కిరణ్, బోర్కుటి తిరుపతి, దాగమ బాపు, కొండ్ర పున్నం,ఎస్టీ కాలని స్కూల్ టీచర్ కమలాకర్ పాల్గొన్నారు.
11







