బెల్లంపల్లి, ఆర్.కె న్యూస్: హనుమాన్ బస్తీకి చెందిన నిరుపేద యువతి ఆకిరెడ్డి అనూష వివాహానికి జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో రూ. 6,025 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు లేని నిరుపేద యువతి వివాహానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఇప్ప రవి, గౌరవ సలహాదారులు సింగతి తిరుమల్, నాయకులు పోలు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు పన్నాల సదానందం, వేల్పుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
14







