సొన్, ఆర్.కె న్యూస్: నిర్మల్ జిల్లా సొన్ మండల కేంద్రంలో మంగళవారం గ్రామస్తులకు సైబర్ నేరాలపై ఏఎస్ఐ దేవన్న అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా అపరిచితులు ఫోన్ చేసి ఓటిపి గానీ, సివివి నెంబర్ కానీ చెప్పకూడదని అన్నారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు అడిగినప్పుడు వివరాలు చెబితే బ్యాంకు ఖాతాలోని డబ్బులను స్వాహా చేసే అవకాశం ఉందని, అందుకు ఎవరికి బ్యాంకు వివరాలను చెప్పకూడదని సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
4







