నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో (కేజీబీవీ) శుక్రవారం విద్యార్థినులకు యూనిఫార్ముల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జీఈసీఓ విజయలక్ష్మి, సెక్టోరల్ అధికారి-4 కృష్ణమూర్తి, స్థానిక మున్సిపల్ కార్పొరేటర్ యశోద ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినులకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని రకాల వసతులను కల్పిస్తోందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థినులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ నస్పూర్ స్పెషల్ ఆఫీసర్ ఎస్. మౌనిక, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
10







