- నస్పూర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న
- జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నస్పూర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన చూపిన బాటలోనే ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జయశంకర్ ఆలోచనలు, సేవలు తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కే. సురేందర్ రెడ్డి, నాయకులు బండి రమేష్, రమేష్, అహ్మద్, పూధరి కుమార్, రుకుం తిరుమల్, పానుగంటి సత్తయ్య, ఆకునూరి సంపత్, భానుచందర్, రఫీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.







