నస్పూర్, ఆర్.కె న్యూస్: వ్యాపారస్తులు తమ దుకాణాల్లో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు చందర్ తెలిపారు. బుధవారం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిసి కెమెరాల ఆవశ్యకత, ట్రాఫిక్ నిబంధనలపై స్ట్రీట్ వెండర్స్ కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ సీఐ మాట్లాడుతూ, స్ట్రీట్ వెండర్స్ ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు లో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం. సంతోష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
- కారుణ్య నియామక పత్రాలు అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: కారుణ్య నియామకాల ద్వారా విధుల్లో చేరుతున్న యువ ఉద్యోగులు సింగరేణి సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. బుధవారం జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 52 మంది కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, దక్షిణ భారతదేశానికే తలమానికం అయిన సింగరేణి సంస్థ కారుణ్య నియామకాలు చేపడుతూ ఎంతో మందికి యువతి, యువకులకు ఉపాధి కల్పిస్తుందని అన్నారు. యువ ఉద్యోగులు సర్ఫేస్ లో లైట్ జాబ్ కోసం ప్రయత్నం చేయకుండా, గైర్హాజరు కాకుండా ఉద్యోగం చేసుకోవాలని, తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ, క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సింగరేణిలో రెండో తరానికి ఉద్యోగాలు రావడం తమ అదృష్టంగా భావించాలని, ఉద్యోగం కల్పించిన తమ తల్లిదండ్రులను, అత్తమామల బాగోగులు చూసుకోవాలని సూచించారు. సింగరేణి సంస్థ ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని, ప్రతి ఒక్క ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి కృషి చేయాలని చెప్పారు. ఉద్యోగులు వృత్తి నైపుణ్యాన్ని సాధించాలని, సీనియర్ ఉద్యోగుల సలహాలు, సూచనలు తీసుకుని ప్రమాద రహిత సింగరేణికి కృషి చేయాలని కోరారు. ఇప్పటి వరకు శ్రీరాంపూర్ ఏరియాలో 3784 మంది అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, సీనియర్ పీవో పి. కాంతారావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో భయాందోళనలకు గురి కాకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ అన్నారు. బుధవారం సిసిసి సింగరేణి ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు హాల్ టికెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పరుచుకొని, లక్ష్య సాధనకు నిరంతర కృషి చేయాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం సమకూర్చిన పరీక్ష సామాగ్రిని జీఎం పదో తరగతి విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఏ. రాజేశ్వర్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఆర్. విష్ణువర్ధన్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సంతోష్, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థలో పని చేస్తున్న యువ ఉద్యోగులు హాజరు శాతం మెరుగుపరుచుకుని, సంస్థ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. శనివారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ జీఎం మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలలో శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు ఉత్పత్తి 111 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 86 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఆర్.కె 5 గని 102 శాతం, ఆర్.కె 6 గని 104 శాతం, ఆర్.కె 7 గని 84 శాతం, ఆర్.కె న్యూ టెక్ గని 112 శాతం, ఎస్సార్పీ 1 గని 73 శాతం, ఎస్సార్పీ3,3ఏ గని 81 శాతం, ఐకె 1ఎ గని 78 శాతంతో భూగర్భ గనులు 90 శాతం సాధించాయని, ఎస్సార్పీ ఓసిపి2 146 శాతం, ఐకె ఓసీపీ 60 శాతంతో శ్రీరాంపూర్ ఏరియా 111 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ సాంకేతికతతో సింగరేణిలో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాగితపు రహిత సేవలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులు పని స్థలాల్లో విధిగా రక్షణ సూత్రాలు పాటించాలని, రక్షణతో బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఎస్ఓపి, ఎస్ఎంపి పాటించాలని అన్నారు. ఫిబ్రవరి నెలలో కౌన్సిలింగ్ ద్వారా 77 మంది ఉద్యోగులకు క్వార్టర్లు కేటాయించినట్లు, ఈ నెలలో 161 మంది ఉద్యోగులకు ఎస్.ఎల్.పి ఆర్డర్లు అందజేయనున్నట్లు తెలిపారు. యువ ఉద్యోగులు తమ నామినీ వివరాలు సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, డిజీఎంలు అరవింద్ రావు, చిరంజీవులు, ఏజీఎం (ఫైనాన్స్) మురళి తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపుర్ ఏరియా జనరల్ మేనేజర్ గా పనిచేస్తూ ఇటీవల సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్)గా నియమితులైన ఎల్.వి సూర్యనారాయణ ఆదివారం సింగరేణి ప్రధాన కార్యాలలయంలోని డైరక్టర్ (ఆపరేషన్స్) ఛాంబర్ నందు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా అన్ని శాఖల జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు, డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్.వి సూర్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
- డి.ఎస్.పి ఎమ్మెల్సీ అభ్యర్థి మంద జ్యోతి
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఈనెల 27న జరుగనున్న ఉమ్మడి మెదక్, కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మంద జ్యోతి అన్నారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేఖరులతో మాట్లాడుతూ, పూలే, అంబేడ్కర్, కాన్షీరాంల ఆశయ సాధనకు ధర్మ సమాజ్ పార్టీ పని చేస్తుందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అగ్రవర్ణాల వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలు, సంపదను కాపాడుకోవడానికి పోటీ చేస్తున్నారని, ఓటర్లను డబ్బులు, మాయమాటలతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అగ్రవర్ణాల వ్యాపారవేత్తలకు తగిన బుద్ధి చెప్పాలని పట్టభద్రులను కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం సహకారం అందించడం ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు జంగపెల్లి రామస్వామి, రేగుంట రాకేష్, ఏదునూరి రమేష్, రాజు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలోని సిసిసి సింగరేణి ఉన్నత పాఠశాల 1999-2000 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నస్పూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో జరుపుకున్నారు. ఆదివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన స్నేహితులందరూ 25 సంవత్సరాలకు ముందు పదో తరగతిలో విద్యను అభ్యసించిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, తమ క్షేమ సమాచారాలు పంచుకుంటూ, ఎంతో సరదాగా ఆటపాటలతో గడిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు జక్కుల మల్లేష్, తొట్ల బుచ్చన్న, కారుకూరి రవీందర్, శ్రీనివాస్ శర్మ, నగేష్, నరేష్, గణేష్, ధనలక్ష్మి, రమాదేవి, రేఖ ఠాగూర్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
- సింగరేణి డైరెక్టర్ (పిపి) కె. వెంకటేశ్వర్లు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న 39 రోజులు బొగ్గు ఉత్పత్తికి అత్యంత కీలకమని, శ్రీరాంపూర్ ఏరియా నిర్ధేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ (పిపి) కె. వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ తో కలిసి శ్రీరాంపూర్ ఉపరితల గని పని స్థలాలు, గని ప్లాన్, కోల్ బెంచ్ లు, ఆఫ్ లోడింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్ (పిపి) ఉద్యోగులు ముందస్తు ప్రణాళికలతో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని, సీఆర్ఆర్, జివిఆర్ ఓబి కాంట్రాక్ట్ కంపెనీ వారు నిర్దేశించిన రోజువారీ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత సాధించడంలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, శ్రీరాంపూర్ ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ టి. శ్రీనివాస్, ఇందారం ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏ. వెంకటేశ్వర్ రెడ్డి, ఇన్చార్జి ఏరియా ఇంజనీర్ సాంబ శివ రావు, గని మేనేజర్ బ్రహ్మాజీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ నాగరాజు, ఏరియా క్వాలిటీ ఇంచార్జ్ కె వెంకటేశ్వర్ రెడ్డి, సెక్యూరిటీ ఆఫీసర్ జక్క రెడ్డి, సేఫ్టీ ఆఫీసర్ జి. సంపత్ తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ సాంకేతికతతో సింగరేణిలో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాగితపు రహిత సేవలకు శ్రీకారం చుడుతున్నట్లు శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం సిసిసిలోని సింగరేణి గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ లో డీజీఎం (ఐటి) బి. హరిప్రసాద్, ఐటీ మేనేజర్ ఏం.కిరణ్ కుమార్, సీనియర్ ప్రోగ్రామర్ కే. శంకర్, ట్రైనీ ప్రోగ్రామర్ జి. రమ్య బృందం ఆధ్వర్యంలో ఏరియా అధికారులకు ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టెక్నాలజీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టెక్నాలజీని పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వినియోగిస్తున్నాయని, సింగరేణిలో సాప్ వినియోగంతో పనులు సులభతరం, ఖచ్చితత్వంగా చేయడం జరుగుతుందని, ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టెక్నాలజీతో కాగితం వినియోగం ఘననీయంగా తగ్గి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్, జీఎం (సివిల్) శ్రీనివాస రావు, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జనరల్ మేనేజర్ సుశాంత సహా, ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, శ్రీరాంపూర్ ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ టి. శ్రీనివాస్ గారు, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, ఏజీఎం (సివిల్ క్వాలిటీ) బి. నవీన్, డీజీఎంలు పి. అరవింద రావు, కె. చిరంజీవులు, ఆనంద్ కుమార్, చంద్ర లింగం, మల్లయ్య, ఆర్.కె 5,6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, డివై సీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు, లా అధికారి శిరీష రెడ్డి, ఎస్టేట్స్ అధికారి వరలక్ష్మి గారు, అకౌంట్స్ మేనేజర్ జి. నాగలక్ష్మి, ఐటీ ప్రోగ్రామార్, వివిధ గనుల మేనేజర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.