నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్కు చెందిన లబ్ధిదారులు దుర్గం రాంబాయి – మల్లయ్య దంపతులు నిర్మించుకున్న నూతన గృహాన్ని మేయర్ ధర్ని మధుకర్ సోమవారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారంతో పూర్తయిన ఈ ఇంటి గృహ ప్రవేశ మహోత్సవానికి మేయర్తో పాటు స్థానిక కార్పొరేటర్ తోట రజిత శ్రీనివాస్ హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్, కార్పొరేటర్లను లబ్ధిదారులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
26







