నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె. న్యూ టెక్ గనిలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజనీర్ (పిట్ ఇంజనీర్) దాసరోజు రాజగోపాల చారిని మంగళవారం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆయనకు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి భవిష్యత్తు జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షించారు. సంస్థ అభివృద్ధిలో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఎండీ. లాలా, బ్రాంచ్ నాయకులు వెంగల కుమారస్వామి, పిట్ సెక్రటరీ జైపాల్ రెడ్డి, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్, సోషల్ మీడియా ఇంచార్జ్ నవీన్ కుమార్, షిఫ్ట్ సెక్రటరీ జి. రాజు, షిఫ్ట్ ఇంచార్జ్లు శంకర్, అరుణ్, రాజ్ కుమార్, సంఘం కార్యకర్తలు సత్యనారాయణ, తలారి రవి, హరీష్, వహీద్, స్వామి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
27







