సోన్, ఆర్.కె న్యూస్: చేపల మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచి చేపలు విక్రయించాలని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ అన్నారు. సోన్ గ్రామ పంచాయతీలో మత్స్యకారుల కొరకు చేపల విక్రయానికి నిర్మించిన వర్క్ షెడ్ నిర్మాణంను డిప్యూటీ కమిషనర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్క్ షెడ్ లోపల పరిశీలించి పరిశుభ్ర వాతావరణంలో చేపల మార్కెట్ను నిర్వహించాలని సూచించారు. నిర్మాణం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.షెడ్డు నిర్మాణం గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి ని అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ చేపల మార్కెట్ ను సోన్ గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా మండలంలోని చుట్టుపక్కల గ్రామాల వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
9







