సోన్ సిఐ గోవర్ధన్ రెడ్డి
సోన్, ఆర్.కె న్యూస్: నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు సోన్ మండల కేంద్రం లో బుధవారం మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం జరిగింది.నేటి యువత మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. యువత ఎటువంటి దురాలవాట్లకు బానిస కాకుండా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమం లో ఎస్సై గోపి, ఏ ఎస్ ఐ దేవన్న, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.







