నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలో జులై 9న నిర్వహించనున్న 24వ ఏరియా స్థాయి త్రైపాక్షిక భద్రతా సమీక్షా సమావేశంపై జీఎం మునిగంటి శ్రీనివాస్ బుధవారం అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. డీజీఎంఎస్ ఇన్స్పెక్టర్లు, యూనియన్ ప్రతినిధులు హాజరయ్యే ఈ భేటీకి అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా గత సమావేశంలో లేవనెత్తిన అంశాల ప్రగతిపై దృష్టి పెట్టాలని, వైద్య సేవలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నందున వైద్య అధికారులు నివేదికలతో సన్నద్ధం కావాలని సూచించారు. గనుల ఏజెంట్లు, ప్రాజెక్ట్ అధికారులు తమ పరిధిలోని భద్రతా ప్రమాణాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఈ సన్నాహక సమావేశంలో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్, ఏరియా ఇంజనీర్ రమణారావు, డీజీఎం (ఐఈడి) రాజన్న, ఏఎస్ఓ విజయ్కుమార్, ఆర్కే-7 గ్రూప్ ఇంజనీర్ ఎన్. శ్రీధర్, ఎస్ఆర్పీ గ్రూప్ ఏజెంట్ రవికుమార్, డీవై సీఎంఓ రమేష్ బాబు, డీజీఎం (వర్క్షాప్) కృష్ణారెడ్డి, సీహెచ్పీ ఇన్చార్జ్ చంద్రలింగం, గనుల మేనేజర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
13







