నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఓటు జీఎంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ ప్రసాద్ను బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, బీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయనతో వివరంగా చర్చించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కృష్ణ ప్రసాద్ విజయవంతంగా విధులు నిర్వహిస్తూ, ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, బ్రాంచ్ కార్యదర్శి మారుతి, బద్రి బుచ్చయ్య, సహాయ కార్యదర్శి చంద్రమోహన్, జాయింట్ సెక్రటరీ రఘురాం, నాయకులు తిరుపతి, సాంబయ్య, పిట్ సెక్రటరీలు వినోద్, మనోజ్, మదన్, నరేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
28







